ETV Bharat / state

ఖాళీ జాగా.... వేసేయ్ పాగా....! - government land occupied at prakasham latest news in telugu

కబ్జాదారులకు అడ్డు అదుపు లేదు. వారికి కావల్సింది ఖాళీగా ఉన్న స్థలం... కబ్జా చేయటం... ఫ్లాట్లు నిర్మించటం. అమాయకపు ప్రజలకు అమ్మేయటం..ఇదీ వారి దందా..మరీ ప్రభుత్వం ఏం చేస్తుందీ..! ఇలాంటి ప్రశ్న రాక మానదు. అసలు ప్రభుత్వ స్థలం కబ్జా జరిగిందనీ ఈనాడు, ఈటీవీ భారత్ కథనం చెప్తేనే కానీ తెలియని పరిస్థితి. ప్రకాశం జిల్లా జరిగిన భూ కబ్జాయే ఇందుకు నిదర్శనం.

Land grabbers who occupy public(government) land at darshi in prakasham
ప్రకాశం జిల్లా దర్శి ప్రధాన రహదారి పక్కన ఆక్రమించిన ప్రభుత్వ భూమి
author img

By

Published : Dec 17, 2019, 10:07 AM IST

ప్రకాశం జిల్లా దర్శి ప్రధాన రహదారి పక్కన ఆక్రమించిన ప్రభుత్వ భూమి

ఖాళీ ప్రభుత్వ భూమి కనబడితే చాలు భూ కబ్జాదారులు వాలిపోతున్నారు. ప్రకాశం జిల్లా దర్శికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొనకొండను గత ప్రభుత్వం పరిశ్రమల కారిడార్​గా ప్రకటించింది. అప్పటి నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో, నియోజకవర్గ కేంద్రమైన దర్శిలోని భూముల విలువ నానాటికీ పెరుగుతున్నాయి. ఇదే ఆసరాగా చేసుకుని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి కనబడితే చాలు... ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. అంతటితో ఆగక కబ్జాదారులు నకిలీ పట్టాలు సృష్టించి ఆక్రమించిన స్థలాన్ని ఫ్లాట్లుగా మార్చి అమాయకులకు అమ్మి అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇదీ జరిగిందీ..
దర్శి పట్టణ శివారులోని దర్శి-అద్దంకి ప్రధాన రహదారికి పక్కన సర్వే నెం 340/5లో ఉన్న 0.94 సెంట్ల స్థలం ఉంది. దీనిలో రాత్రికి రాత్రే బోర్లు వేసి, గృహ నిర్మాణాలకు మార్క్‌ వేశారు. బహిరంగ మార్కెట్లో ఇక్కడ ఒక సెంటు విలువ సుమారు ఆరు లక్షల నుంచి 8 లక్షల వరకు పలుకుతుంది. ఇంతటి విలువైన స్థలంలో... అదీ ప్రధాన రహదారి పక్కన ఆక్రమించి వ్యాపారం చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగాయానికి తెలియకపోవడం శోచనీయం.

''ఈనాడు, ఈటీవీ-భారత్ ''సమాచారంతో రంగంలోకి..
ఈ విషయాన్ని ఈనాడు-ఈటీవీ భారత్ కలసి చారవాణి ద్వారా దర్శి తహసీల్దారు అశోక వర్ధన్ దృష్టికి తీసుకెళ్లింది. దీనికి స్పందించిన ఆయన.. అది ప్రభుత్వ భూమేనని తెలిపారు. అయితే దానిలో 0.16 సెంట్లు భూమిని పీఏసీఎస్ బ్యాంక్ భవన నిర్మాణానికి కేటాయించామని, మిగిలిన స్థలానికి హద్దులు ఏర్పాటు చేసి.. ప్రభుత్వ భూమి అనే సూచికలు చేయిస్తామని అన్నారు.

ఇదీ చదవండి:

సామాజికవర్గాన్ని బట్టి న్యాయమా?: మందకృష్ణ

ప్రకాశం జిల్లా దర్శి ప్రధాన రహదారి పక్కన ఆక్రమించిన ప్రభుత్వ భూమి

ఖాళీ ప్రభుత్వ భూమి కనబడితే చాలు భూ కబ్జాదారులు వాలిపోతున్నారు. ప్రకాశం జిల్లా దర్శికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొనకొండను గత ప్రభుత్వం పరిశ్రమల కారిడార్​గా ప్రకటించింది. అప్పటి నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో, నియోజకవర్గ కేంద్రమైన దర్శిలోని భూముల విలువ నానాటికీ పెరుగుతున్నాయి. ఇదే ఆసరాగా చేసుకుని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి కనబడితే చాలు... ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. అంతటితో ఆగక కబ్జాదారులు నకిలీ పట్టాలు సృష్టించి ఆక్రమించిన స్థలాన్ని ఫ్లాట్లుగా మార్చి అమాయకులకు అమ్మి అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇదీ జరిగిందీ..
దర్శి పట్టణ శివారులోని దర్శి-అద్దంకి ప్రధాన రహదారికి పక్కన సర్వే నెం 340/5లో ఉన్న 0.94 సెంట్ల స్థలం ఉంది. దీనిలో రాత్రికి రాత్రే బోర్లు వేసి, గృహ నిర్మాణాలకు మార్క్‌ వేశారు. బహిరంగ మార్కెట్లో ఇక్కడ ఒక సెంటు విలువ సుమారు ఆరు లక్షల నుంచి 8 లక్షల వరకు పలుకుతుంది. ఇంతటి విలువైన స్థలంలో... అదీ ప్రధాన రహదారి పక్కన ఆక్రమించి వ్యాపారం చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగాయానికి తెలియకపోవడం శోచనీయం.

''ఈనాడు, ఈటీవీ-భారత్ ''సమాచారంతో రంగంలోకి..
ఈ విషయాన్ని ఈనాడు-ఈటీవీ భారత్ కలసి చారవాణి ద్వారా దర్శి తహసీల్దారు అశోక వర్ధన్ దృష్టికి తీసుకెళ్లింది. దీనికి స్పందించిన ఆయన.. అది ప్రభుత్వ భూమేనని తెలిపారు. అయితే దానిలో 0.16 సెంట్లు భూమిని పీఏసీఎస్ బ్యాంక్ భవన నిర్మాణానికి కేటాయించామని, మిగిలిన స్థలానికి హద్దులు ఏర్పాటు చేసి.. ప్రభుత్వ భూమి అనే సూచికలు చేయిస్తామని అన్నారు.

ఇదీ చదవండి:

సామాజికవర్గాన్ని బట్టి న్యాయమా?: మందకృష్ణ

Intro:AP_ONG_51_17_GOVT_PLEACE_AKRAMANA_AV_AP10136

కాళీ జాగానా.... వేసేయ్ పాగా....

కాళీ ప్రభుత్వభూమి కనబడితే చాలు భూ కబ్జాదారులు కబ్జా చేసేందుకు వాలిపోతున్నారు.

.దర్శికి 22కిలోమీటర్ల దూరంలో ఉన్న దొనకొండను గత ప్రభు త్వం పరిశ్రమల కారిడార్ గా ప్రకటించింది.అప్పటినుండి చు ట్టుపక్కల ఉన్న గ్రామాలలో మరియు నియోజకవర్గకేంద్రమైన దర్శిలోని భూముల విలువ నానాటికీ పెరుగుతున్నాయి.ఇదే ఆసరాగా చేసుకుని కాళీగా ఉన్న ప్రభుత్వభూమి కనబడితే చాలు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు.అంతటితో ఆగక కబ్జాదారులు నకిలీ పట్టాలను సృష్టించి ఆక్రమించిన స్థలాన్ని ఫ్లాట్లుగా మార్చి అమాయకులకు అమ్మి అందినకాడికిసొమ్ము చేసుకుంటున్నారు.
దర్శి పట్టణ శివారులోని దర్శి-అద్దంకి ప్రధాన రహదారికి పక్క న సర్వే నెం 340/5 లో ఉన్న0.94 సెంట్లు స్థలం ఉంది.దీనిలో రాత్రికి రాత్రే బోర్లువేసి,గృహనిర్మాణాలకుముగ్గులుపోసేశారు. బహిరంగ మార్కెట్లో ఇక్కడ ఒక సెంటు విలువసుమారుఆరు లక్షల నుండి 8లక్షల వరకు పలుకుతుంది.ఇంతటి విలువైన స్థలంలో...అదీ ప్రధాన రహదారి ప్రక్కన ఆక్రమించి వ్యాపారం చేస్తున్నప్పటికీ అధికారయంత్రాంగాయానికితెలియకపోవడం శోచనీయం.

''ఈనాడు,ఈటీవీ భారత్ ''సమాచారంతో రంగంలోకి....

ఈ విషయాన్ని ఈనాడు-ఈటీవీ భారత్ చారవాణి ద్వారా దర్శి తహసీల్దారు అశోక వర్ధన్ దృష్టికి తీసుకెళ్లింది.దీనికి స్పందించిన ఆయన అది ప్రభుత్వ భూమేనని తెలిపారు. అయితే దానిలో 0.16 సెంట్లు భూమిని పీఏసీఎస్ బ్యాంక్ భవన నిర్మాణానికి కేటాయించామని,మిగిలిన స్థలానికి హద్దులు ఏర్పాటుచేసి ఇది ప్రభుత్వ భూమి అనే సూచికలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.



Body:ప్రకాశంజిల్లా దర్శి.


Conclusion:కొండలరావు దర్శి 9848450509.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.