ETV Bharat / state

విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని జనసేన, భాజపా నిరసన

author img

By

Published : May 23, 2020, 10:25 PM IST

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ చీరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట జనసేన, భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

Janasena and bjp protest against electricity tariff cuts at cheerala
తహసీల్దార్​కు వినతి పత్రం అందజేస్తున్న భాజపా, జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా చీరాలలో... పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ జనసేన, భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఒక నెల బిల్లు పూర్తిగా మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. భాజపా నాయకుడు మువ్వల వెంకట రమణారావు మాట్లాడుతూ...ప్రస్తుతం అందరూ లాక్​డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉండగా విద్యుత్ ఛార్జీలు పెంచడం సమంజసం కాదన్నారు. వైకాాపా పాలన చేపట్టి సంవత్సరం అయిందని గోప్పలు చేప్పుకుంటున్నారు కానీ... ఈ సంవత్సర కాలంలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.

ప్రకాశం జిల్లా చీరాలలో... పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ జనసేన, భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఒక నెల బిల్లు పూర్తిగా మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. భాజపా నాయకుడు మువ్వల వెంకట రమణారావు మాట్లాడుతూ...ప్రస్తుతం అందరూ లాక్​డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉండగా విద్యుత్ ఛార్జీలు పెంచడం సమంజసం కాదన్నారు. వైకాాపా పాలన చేపట్టి సంవత్సరం అయిందని గోప్పలు చేప్పుకుంటున్నారు కానీ... ఈ సంవత్సర కాలంలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.

ఇదీ చదవండి:బ్యాంకుల ముందు ఖాతాదారుల కష్టాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.