ETV Bharat / state

మార్కాపురంలో తితిదే ఛైర్మన్​ సుబ్బారెడ్డి పర్యటన

author img

By

Published : Mar 20, 2021, 5:25 PM IST

Updated : Mar 20, 2021, 10:21 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలో తితిదే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్​.. ఈ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం గుండ్లకమ్మ నది ఒడ్డునున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమంలో వైవీ పాల్గొన్నారు.

ttd chairman yv subbareddy markapuram tour
మార్కాపురంలో పర్యటిస్తున్న తితిదే ఛైర్మన్​ సుబ్బారెడ్డి

తిరుపతి బర్ద్ వైద్యశాల ఆధ్వర్యంలో.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజల నుంచి శిబిరానికి విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలతో బాధపడుతున్న సుమారు 1,500 మంది రోగులు.. చికిత్స పొందేందుకు వైద్య శిబిరానికి వచ్చారు. తితిదే చైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి సహకారంతో.. స్థానిక టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో ఈ కార్యక్రం ఏర్పాటు చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబులతో కలిసి.. ఆయన ఈ శిబిరాన్ని ప్రారంభించారు.

గుండ్లకమ్మ నది ఒడ్డున వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమానికి తితిదే ఛైర్మన్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గోపూజ నిర్వహించి.. గుడికి ఆవును అందించారు. మార్కాపురంలో రహదారులపై తిరుగుతూ ఆవులు తరచూ ప్రమాదాలకు గురౌతున్నట్లు.. భారతి అనే సామాజిక కార్యకర్త ఆయన దృష్టికి తీసుకొచ్చింది. వెంటనే స్పందించిన సుబ్బారెడ్డి.. ఆవుల యజమానులతో మాట్లాడాలని స్థానిక ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణను ఆదేశించారు. వారు స్పందించని ఎడల అన్నిటినీ గోశాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తిరుపతి బర్ద్ వైద్యశాల ఆధ్వర్యంలో.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజల నుంచి శిబిరానికి విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలతో బాధపడుతున్న సుమారు 1,500 మంది రోగులు.. చికిత్స పొందేందుకు వైద్య శిబిరానికి వచ్చారు. తితిదే చైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి సహకారంతో.. స్థానిక టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో ఈ కార్యక్రం ఏర్పాటు చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబులతో కలిసి.. ఆయన ఈ శిబిరాన్ని ప్రారంభించారు.

గుండ్లకమ్మ నది ఒడ్డున వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమానికి తితిదే ఛైర్మన్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గోపూజ నిర్వహించి.. గుడికి ఆవును అందించారు. మార్కాపురంలో రహదారులపై తిరుగుతూ ఆవులు తరచూ ప్రమాదాలకు గురౌతున్నట్లు.. భారతి అనే సామాజిక కార్యకర్త ఆయన దృష్టికి తీసుకొచ్చింది. వెంటనే స్పందించిన సుబ్బారెడ్డి.. ఆవుల యజమానులతో మాట్లాడాలని స్థానిక ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణను ఆదేశించారు. వారు స్పందించని ఎడల అన్నిటినీ గోశాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

అంతర్ జిల్లా దొంగ అరెస్టు... బంగారం స్వాధీనం

Last Updated : Mar 20, 2021, 10:21 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.