ETV Bharat / state

అటు చెరువు..ఇటు శ్మశానం! నివేశన స్థలాలు ఎక్కడిస్తారు..? - పమిడిపాడులో నివేశన స్థలాలు

పేదలకు అందించే నివేశన స్థలాల గడువు సమీపిస్తుండగా.. లేఔట్లు సిద్ధం చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గతంలో విమర్శలు, అభ్యంతరాలు ఉన్నా స్థలాలనే ఖరారు చేస్తుండటంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పమిడిపాడులో చెరువు, శ్మశానం పక్కన ఇంటి స్థలాలు కేటాయించడంపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

housesite problems at pamidipadu
పమిడిపాడులో ఇళ్లస్థలాలు
author img

By

Published : Dec 11, 2020, 10:35 AM IST

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలో 170 మందికి నివేశన స్థలాలు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. పమిడిపాడు శివారులో మూడు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సేకరించేందుకు సిద్ధపడి గతంలోనే గ్రామసభ నిర్వహించారు. ఆ ప్రదేశం శ్మశానానికి ఆనుకుని ఉంటుందని, దాని వెనుక ఊరుచెరువు ఉందని గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు. గ్రామసభ వాయిదా పడింది. లబ్ధిదారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు కూడా తర్వాత దానివైపు చూడలేదు.

ఈనెల 25న ఇళ్లపట్టాల పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. అందుకు అనుగుణంగా ఇటీవల స్థానికంగా గ్రామ సభ ఏర్పాటు చేసి లాటరీ తీశారు. ఆ మేరకు గతంలో వివాదం ఉన్న స్థలాన్నే ఖరారు చేశారు. పొలం పనులకు వెళ్లిన సమయంలో లాటరీ ఎలా తీస్తారని...సేకరించిన పొలం రోడ్డుకు కొంచెం దిగువన ఉందని... మట్టితో లెవల్‌ చేయడానికి చాలా వ్యయం అవుతుందని లబ్ధిదారులు అధికారులను అడిగారు. శ్మశానాల పక్కన...చౌడు భూముల్లో ఇళ్లు ఎలా నిర్మిస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...ఇప్పటికైనా అందరికి అమోదయోగ్యమైన స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు

స్థల సేకరణపై గ్రామస్థుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాలేదని...అందుకే ఆ భూమినే నివేశనస్థలాలకు కేటాయించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. గ్రామస్థులు మాత్రం ఉన్నాతాధికారులకు అర్జీలు ఇచ్చినా ఎటువంటి ప్రయోజన లేకుండా పోయిందని వాపోతున్నారు.

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలో 170 మందికి నివేశన స్థలాలు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. పమిడిపాడు శివారులో మూడు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సేకరించేందుకు సిద్ధపడి గతంలోనే గ్రామసభ నిర్వహించారు. ఆ ప్రదేశం శ్మశానానికి ఆనుకుని ఉంటుందని, దాని వెనుక ఊరుచెరువు ఉందని గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు. గ్రామసభ వాయిదా పడింది. లబ్ధిదారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు కూడా తర్వాత దానివైపు చూడలేదు.

ఈనెల 25న ఇళ్లపట్టాల పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. అందుకు అనుగుణంగా ఇటీవల స్థానికంగా గ్రామ సభ ఏర్పాటు చేసి లాటరీ తీశారు. ఆ మేరకు గతంలో వివాదం ఉన్న స్థలాన్నే ఖరారు చేశారు. పొలం పనులకు వెళ్లిన సమయంలో లాటరీ ఎలా తీస్తారని...సేకరించిన పొలం రోడ్డుకు కొంచెం దిగువన ఉందని... మట్టితో లెవల్‌ చేయడానికి చాలా వ్యయం అవుతుందని లబ్ధిదారులు అధికారులను అడిగారు. శ్మశానాల పక్కన...చౌడు భూముల్లో ఇళ్లు ఎలా నిర్మిస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...ఇప్పటికైనా అందరికి అమోదయోగ్యమైన స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు

స్థల సేకరణపై గ్రామస్థుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాలేదని...అందుకే ఆ భూమినే నివేశనస్థలాలకు కేటాయించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. గ్రామస్థులు మాత్రం ఉన్నాతాధికారులకు అర్జీలు ఇచ్చినా ఎటువంటి ప్రయోజన లేకుండా పోయిందని వాపోతున్నారు.

ఇదీ చూడండి.

బిల్లు ఎక్కువ వేశారని ఆస్పత్రి సిబ్బందిపై యువకుడు దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.