ETV Bharat / state

పీఠాపురంలో వైకాపా వర్గీయుల ఘర్షణ... పోలీస్ స్టేషన్​లో కౌన్సిలింగ్ - పీఠాపురంలో వైకాపా నాయకుల ఘర్షణ

ప్రకాశం జిల్లా పీఠాపురం గ్రామంలో వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలపై బైండోవర్ కేసులు పెట్టి పోలీసులు పోలీస్ స్టేషన్​కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే పోలీసులు కొట్టటంతో తీవ్రంగా గాయపడ్డట్లు ఓ వర్గం ఆరోపణలు చేయటంతో... జరుగుమిల్లి ఎస్సై దాన్ని ఖండించారు. కేవలం ఇరువర్గాలను స్టేషన్​కు పిలిపించి కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చామని... ఎవ్వరిని కొట్టలేదని స్పష్టం చేశారు.

dispute between ycp followers in pitapuram at prakasam district
పీఠాపురంలో వైకాపా వర్గీయుల ఘర్షణ... పోలీస్ స్టేషన్​లో కౌన్సిలింగ్
author img

By

Published : Aug 7, 2020, 11:28 PM IST

ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం పీఠాపురంలో వైకాపాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పీఠాపురం గ్రామంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా వైకాపాలో ఒక వర్గం పలు పనులు చేపట్టింది. ఈ పనుల్లో కాలువ విషయంలో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేయటంతో... దీనిపై ఇరువర్గాలు ఈ నెల 4న గొడవ పడ్డరు.

విషయం పోలీసులకు తెలవటంతో ఇరువర్గాలపై బైండోవేర్ కేసులు పెట్టారు. మరోసారి గొడవ పడటంతో పోలీస్ స్టేషన్​కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కౌన్సెలింగ్ పేరుతో తమ వర్గానికి చెందిన వారిని దారుణంగా కొట్టారని... వారు కొట్టటంతో తీవ్రంగా గాయపడి రిమ్స్​ ఆసుపత్రికి వెళ్లామని కొండలు వర్గం ఆరోపించారు. ఈ విషయాన్ని జరుగుమిల్లి ఎస్సై కమలాకర్ ఖండించారు. ఇరువర్గాలు గొడవ పడితే బైండోవర్ కేసు పెట్టి స్టేషన్​కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామని, ఎవరినీ కొట్టలేదని, కొండలుపై గతంలో ఆరు కేసులున్నాయని ఆయన తెలిపారు.

ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం పీఠాపురంలో వైకాపాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పీఠాపురం గ్రామంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా వైకాపాలో ఒక వర్గం పలు పనులు చేపట్టింది. ఈ పనుల్లో కాలువ విషయంలో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేయటంతో... దీనిపై ఇరువర్గాలు ఈ నెల 4న గొడవ పడ్డరు.

విషయం పోలీసులకు తెలవటంతో ఇరువర్గాలపై బైండోవేర్ కేసులు పెట్టారు. మరోసారి గొడవ పడటంతో పోలీస్ స్టేషన్​కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కౌన్సెలింగ్ పేరుతో తమ వర్గానికి చెందిన వారిని దారుణంగా కొట్టారని... వారు కొట్టటంతో తీవ్రంగా గాయపడి రిమ్స్​ ఆసుపత్రికి వెళ్లామని కొండలు వర్గం ఆరోపించారు. ఈ విషయాన్ని జరుగుమిల్లి ఎస్సై కమలాకర్ ఖండించారు. ఇరువర్గాలు గొడవ పడితే బైండోవర్ కేసు పెట్టి స్టేషన్​కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామని, ఎవరినీ కొట్టలేదని, కొండలుపై గతంలో ఆరు కేసులున్నాయని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

'విశాఖలో 18,500 టన్నుల అమ్మోనియం నైట్రేట్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.