సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ రోజు దేశ వ్యాప్తంగా కార్మికుల కోర్కెలు దినం జరిగింది. అందులో భాగంగా బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామంలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు గ్రామ సచివాలయం ఎదుట నిరసన తెలియజేశారు. కరోనా వ్యాధి నిర్ధరణ కిట్లు పంపిణీ చేయాలని ఆరోగ్య భద్రత కల్పించాలని, పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు చిన్నమ్మాయి, అంగన్వాడీ, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది చదవండి అద్దంకిలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన