ETV Bharat / state

భైరవకోనలో భక్తుల కోసం వసతి గృహం ప్రారంభం

author img

By

Published : Nov 22, 2020, 10:41 AM IST

కనిగిరి నియోజకవర్గంలోని పవిత్ర పుణ్య క్షేత్రమైన భైరవకోనను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్​ సందర్శించారు. భక్తుల కోసం నిర్మించిన విశ్రాంతి వసతి గృహాన్ని ప్రారంభించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Accommodation for devotees in Bhairavkona
భైరవకోనలో వసతి గృహం ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోని భైరవకొనలో.. నూతనంగా నిర్మించిన భక్తుల విశ్రాంతి భవనాన్ని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

త్రిముఖ దుర్గాభాదేవి, భైరవేశ్వరుని దర్శించుకున్నారు. జలపాతాన్ని సందర్శించి, పూజలు చేసి జలహారతి ఇచ్చారు. వీరికి చంద్రశేఖరపురం మండల వైకపా కార్యకర్తలు డప్పులు, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వసతులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని వారు ఆదేశించారు.

ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోని భైరవకొనలో.. నూతనంగా నిర్మించిన భక్తుల విశ్రాంతి భవనాన్ని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

త్రిముఖ దుర్గాభాదేవి, భైరవేశ్వరుని దర్శించుకున్నారు. జలపాతాన్ని సందర్శించి, పూజలు చేసి జలహారతి ఇచ్చారు. వీరికి చంద్రశేఖరపురం మండల వైకపా కార్యకర్తలు డప్పులు, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వసతులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని వారు ఆదేశించారు.

ఇవీ చూడండి:

డ్రైవర్ నిద్ర మత్తు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.