ETV Bharat / state

గేదెలను తప్పించబోయి బైకు బోల్తా.. మహిళ మృతి - a women died in road accident at vaggampalli

ప్రకాశం జిల్లా పామూరు మండలం వగ్గంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గేదెలు అడ్డు రావడంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి బొల్తా కొట్టిన ఘటనలో మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె భర్త తీవ్ర గాయాలపాలయ్యారు.

accident at vaggampalli
గేదెలను తప్పించబోయి బొల్తా కొట్టిన బైకు
author img

By

Published : Feb 21, 2021, 9:18 PM IST

ప్రకాశం జిల్లా అచ్చంపల్లి గ్రామానికి చెందిన మాదిరెడ్డి కోటేశ్వరమ్మ.. ఆమె భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై కనిగిరిలోని కొడుకు వద్దకు వెళ్తున్నారు. పామూరు మండలం వగ్గంపల్లి వద్ద గేదెలు అడ్డు వచ్చిన కారణంగా.. వారి బైకు అదుపుతప్పి బొల్తా కొట్టింది.

కోటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్తను ఆస్పత్రిలో చేర్పించారు.

ప్రకాశం జిల్లా అచ్చంపల్లి గ్రామానికి చెందిన మాదిరెడ్డి కోటేశ్వరమ్మ.. ఆమె భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై కనిగిరిలోని కొడుకు వద్దకు వెళ్తున్నారు. పామూరు మండలం వగ్గంపల్లి వద్ద గేదెలు అడ్డు వచ్చిన కారణంగా.. వారి బైకు అదుపుతప్పి బొల్తా కొట్టింది.

కోటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్తను ఆస్పత్రిలో చేర్పించారు.

ఇదీ చూడండి:

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్... పలు చోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.