ETV Bharat / state

'పంట నష్టపోయిన ప్రతిరైతు పేరును నమోదు చేయండి'

author img

By

Published : Dec 8, 2020, 9:33 PM IST

నెల్లూరు జిల్లా రూరల్ మండలంలోని పొట్టేపాలెంలో వ్యవసాయ అధికారులు పర్యటించారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన ప్రతిరైతు పేరును నమోదు చేయాలని గ్రామ వ్యవసాయ సహాయకులకు స్పష్టం చేశారు.

నష్టపోయిన ప్రతిరైతు పేరు
నష్టపోయిన ప్రతిరైతు పేరు

నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాలెంలో ఉద్యాన సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్, వ్యవసాయ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ అరటి, కూరగాయ, వరి పంటలను పరిశీలించారు. నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకోవాలని గ్రామ వ్యవసాయ సహాయకులకు సూచించారు. ఈ నెల 15లోపు పంటలు దెబ్బతిన్న ప్రతి రైతు పేరు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాలెంలో ఉద్యాన సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్, వ్యవసాయ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ అరటి, కూరగాయ, వరి పంటలను పరిశీలించారు. నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకోవాలని గ్రామ వ్యవసాయ సహాయకులకు సూచించారు. ఈ నెల 15లోపు పంటలు దెబ్బతిన్న ప్రతి రైతు పేరు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

అధ్వానంగా ఆత్మకూరు రోడ్లు.. వాహనదారులకు తప్పని ఇక్కట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.