ఇదీ చదవండి:
నీటి గుంటలో పడి విద్యార్థి మృతి
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరులో దారుణం జరిగింది. అక్రమంగా తవ్విన గ్రావెల్ గుంతలో పడి అఖిల్ అనే మూడో తరగతి విద్యార్థి మృతి చెందాడు. సరదాగా స్నేహితులతో ఆడుకునేందుకు వెళ్లిన అఖిల్ ప్రమావశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామాంలో విషాదం నెలకొంది. తమ బిడ్డ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
నీటి గుంటలో పడి విద్యార్థి మృతి