ఆత్మకూరు అభివృద్ధి పనులపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రత్యేక శ్రద్ధవహించారు. ఆయన ఆదేశాల మేరకు రింగ్ రోడ్, ట్యాంక్ బండ్ నిర్మాణాల కోసం అధికారులు ప్రాథమిక దశ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యాలయ టౌన్ ప్లానింగ్ రీజినల్ డైరెక్టర్ ధర్మారావు ఆత్మకూరులో పర్యటించారు.
తొలుత ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు రూపొందించిన రింగ్ రోడ్, ట్యాంక్ బండ్ సంబంధించిన మ్యాన్యువల్ మ్యాపింగ్, గూగుల్ మ్యాప్ ను పరిశీలించారు. అనంతరం ట్యాంక్ బండ్ కోసం రూపొందించిన డిజైన్ను పరిశీలించారు. వెంకట్రావు పల్లి నుంచి కాశినాయన ఆశ్రమం మీదగా అశ్విని పురం, జంగాలపల్లి గ్రామాల మధ్య నుంచి ఎస్ఎంఎస్ పార్క్ వరకు ఆత్మకూరు పట్టణాన్ని చుట్టుకుంటూ ఈ నిర్మాణం చేపట్టనున్నారు.
ఇదీ చదవండీ.. జగతి కేసులో ముగిసిన వాదనలు