ఈ ఏడాది మరో నాలుగు కీలక ప్రయోగాలకు షార్ వేదిక కానుందని డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ సూచన ప్రాయాంగా వెల్లడించారు. పీఎస్ఎల్వీ ద్వారా అక్టోబర్లో ప్రయోగం చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జీఎస్ఎల్వీ మార్క్ 2 నుంచి మరో రెండు ప్రయోగాలు జరిపే అవకాశం ఉందని చెప్పారు. చంద్రయాన్ 2 ప్రస్తుతం సరైన కక్ష్యలోనే ప్రయాణిస్తుందని, ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అనుకున్న దశలోనే చంద్రయాన్ 2 ఉన్నట్లు ఆర్ముగం వెల్లడించారు.
ఇదీ చదవండి : అవినీతి రహిత పాలనకు పునరంకితం: సీఎం జగన్