ETV Bharat / state

నిల్వ ఆహారపదార్థాల సరఫరా...  ప్రజల ప్రాణాలతో చెలగాటం... - Adulterated food

నెల్లూరు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మాంసం ఇతర ఆహార పదార్థాలను వారాల తరబడి నిల్వచేసి.. వాటిని ప్రజలకు విక్రయిస్తున్నారు.. రెండు నెలలుగా అధికారుల దాడుల్లో బయటపడుతున్న ఆహార నిల్వలే.. హోటళ్ల యజమానుల నిర్వాకానికి ప్రత్యక్ష నిదర్శనం.

nellore-hotels-supplied-adulterated-food-in-andhrapradesh
author img

By

Published : Aug 30, 2019, 10:28 AM IST

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటళ్లు

నెల్లూరంటే రుచికి, శుచికి పెట్టింది పేరు. నగరంలో 50కిపైగా పెద్ద రెస్టారెంట్లు, 100కుపైగా హోటల్స్. అదే స్థాయిలో మాంసం దుకాణాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో 46మండలాల నుంచి ప్రజలు వివిద పనులపై నిత్యం నగరానికి వస్తుంటారు. అలా వచ్చిన వారు ఆ పూటకి హోటల్స్, రెస్టారెంట్లలో భోజనం చేస్తుంటారు. వీరికి కల్తీ ఆహారాన్ని అందిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫ్రీజర్లు ఏర్పాటు చేసుకుని మాంసాన్ని వారాల తరబడి నిల్వ చేస్తున్నారు. పాడైపోయినా వాటినే వండుతున్నారు. ఈ నిర్వాకంపై నగరపాలక సంస్థ.. రెండు నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేసింది. అనేక చోట్ల పెద్దమొత్తంలో పాడైన మంసాన్ని వినియోగదారులకు వడ్డిస్తున్నారని గుర్తించారు.

ప్రజల ఆరోగ్యాలను పెట్టుబడిగా పెడుతున్న హోటళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 2నెలలుగా చేస్తున్న దాడుల్లో భారీగా నిల్వచేసిన ఆహారపదార్థాలను స్వాధీనం చేసుకున్నామని నగరపాలక సంస్థ కమిషనర్‌ తెలిపారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే హోటళ్లను సీజ‌్ చేస్తామని హెచ్చరించారు. దాడులను ఇలానే కొనసాగించాలంటున్న నగరవాసులు..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటళ్లు

నెల్లూరంటే రుచికి, శుచికి పెట్టింది పేరు. నగరంలో 50కిపైగా పెద్ద రెస్టారెంట్లు, 100కుపైగా హోటల్స్. అదే స్థాయిలో మాంసం దుకాణాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో 46మండలాల నుంచి ప్రజలు వివిద పనులపై నిత్యం నగరానికి వస్తుంటారు. అలా వచ్చిన వారు ఆ పూటకి హోటల్స్, రెస్టారెంట్లలో భోజనం చేస్తుంటారు. వీరికి కల్తీ ఆహారాన్ని అందిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫ్రీజర్లు ఏర్పాటు చేసుకుని మాంసాన్ని వారాల తరబడి నిల్వ చేస్తున్నారు. పాడైపోయినా వాటినే వండుతున్నారు. ఈ నిర్వాకంపై నగరపాలక సంస్థ.. రెండు నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేసింది. అనేక చోట్ల పెద్దమొత్తంలో పాడైన మంసాన్ని వినియోగదారులకు వడ్డిస్తున్నారని గుర్తించారు.

ప్రజల ఆరోగ్యాలను పెట్టుబడిగా పెడుతున్న హోటళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 2నెలలుగా చేస్తున్న దాడుల్లో భారీగా నిల్వచేసిన ఆహారపదార్థాలను స్వాధీనం చేసుకున్నామని నగరపాలక సంస్థ కమిషనర్‌ తెలిపారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే హోటళ్లను సీజ‌్ చేస్తామని హెచ్చరించారు. దాడులను ఇలానే కొనసాగించాలంటున్న నగరవాసులు..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Intro:ap_knl_21_11_elections_nandyal_av_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఈ కారణంగా ఆ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం కాలేదు. దీనితో ఓటర్లు పోలింగ్ సిబ్బంది పై వాగ్వివాదానికి దిగారు. పట్టణంలో గాంధీనగర్, బస్టాండ్ సమీపంలో ని చిన్మయ స్కూలు, మున్సిపల్ స్కూలు, ఆత్మకూరు బస్టాండ్, ఎన్జీవోల కాలని తదితరు ప్రాంతాల్లో పోలింగ్ బూతుల్లో ఈ వి ఎమ్ లు మొరాయించాయి. గాంధీ నగర్ లో జనసేన నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గ అభ్యర్థులు శ్రీధర్ రెడ్డి, సుజల దంపతులు ఓటు వేసేందుకు వరస లో నిలబడ్డారు. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్థితిపై అరా తీశారు.



Body:నంద్యాల ఎన్నికలు


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.