పదిహేను రోజుల్లోపు పంట నష్టపరిహారం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమయ్యే విధంగా ఏర్పాట్లు చేశామని నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. జూలై నుంచి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 5,076 హెక్టార్లు పంట నష్టపోయినట్లు నివేదికలు అందాయన్నారు. వాటికి సంబంధించి దాదాపు 5.50 కోట్ల రూపాయలు రైతులకు ప్రభుత్వం అందించనుందని వివరించారు. లబ్ధిదారుల జాబితాను ఆయా గ్రామాల సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శించాలని ఆదేశించామన్నారు.
పలు సచివాలయాలను జిల్లా సందర్శించి.. ఆయా రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామస్థులతో కలిసి పనిచేయాలని సూచించారు. సరిగా పాటిస్తున్నారో లేదో తెలుసుకునేందుకే వివిధ గ్రామాలలో సచివాలయాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: