ETV Bharat / state

కండలేరు జలాశయానికి 60 టీఎంసీల నీరు.. ఆనందంలో రైతులు - నెల్లూరులో కండలేరు జలాశయం వార్తలు

కండలేరు జలాశయానికి 60 టీఎంసీల నీరు వచ్చి చేరింది. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్లోనూ నీరు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ హరినాథరెడ్డి తెలిపారు.

kandaleru-dam
kandaleru-dam
author img

By

Published : Nov 6, 2020, 7:10 PM IST

కండలేరు జలాశయం నిర్మించి 40 సంవత్సరాలు పూర్తి కావస్తున్నదని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ హరినాథరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు కండలేరు జలాశయంలో 50 టీఎంసీల నీరు నింపామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం ఆదేశాలతో 60 టీఎంసీల నీరు చేర్చామని చెప్పారు.

2010లో 52 టీఎంసీలు మాత్రమే నింపామని.. ఇప్పుడు 60 టీఎంసీల నీరు చేరడంతో కండలేరు జలాశయం ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ రబీ సీజన్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వివరించారు. అంతేకాకుండా వచ్చే ఖరీఫ్ సీజన్లోనూ నీరు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చిత్తూరు నుంచి చెన్నై ప్రజలకు తాగు నీరు సమృద్ధిగా అందిస్తున్నామన్నారు.

కండలేరు జలాశయం నిర్మించి 40 సంవత్సరాలు పూర్తి కావస్తున్నదని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ హరినాథరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు కండలేరు జలాశయంలో 50 టీఎంసీల నీరు నింపామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం ఆదేశాలతో 60 టీఎంసీల నీరు చేర్చామని చెప్పారు.

2010లో 52 టీఎంసీలు మాత్రమే నింపామని.. ఇప్పుడు 60 టీఎంసీల నీరు చేరడంతో కండలేరు జలాశయం ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ రబీ సీజన్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వివరించారు. అంతేకాకుండా వచ్చే ఖరీఫ్ సీజన్లోనూ నీరు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చిత్తూరు నుంచి చెన్నై ప్రజలకు తాగు నీరు సమృద్ధిగా అందిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

భారీగా పెరిగిన బంగారం ధర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.