ETV Bharat / state

'బిల్లుల చెల్లింపులను వైకాపా అడ్డుకుంటోంది' - గూడూరులో తెదేపా సమావేశం

గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు వైకాపా బిల్లులు కావాలనే అడ్డుకుంటుందని నెల్లూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు బీదా రవిచంద్ర అన్నారు.

తెదేపా జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర
తెదేపా జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర
author img

By

Published : Jun 2, 2020, 4:29 PM IST

నెల్లూరు జిల్లా గూడూరు తెదేపా కార్యాలయంలో.. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను వైకాపా ప్రభుత్వం చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు.

నీరు-చెట్టు, సిమెంట్ రోడ్లు, తెలుగు గంగ పనులకు సంబంధించి బిల్లులు చెల్లించకుండా వైకాపా నేతలు అడ్డుకుంటున్నారన్నారు. పెండింగ్ బిల్లుల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తెదేపా నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

నెల్లూరు జిల్లా గూడూరు తెదేపా కార్యాలయంలో.. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను వైకాపా ప్రభుత్వం చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు.

నీరు-చెట్టు, సిమెంట్ రోడ్లు, తెలుగు గంగ పనులకు సంబంధించి బిల్లులు చెల్లించకుండా వైకాపా నేతలు అడ్డుకుంటున్నారన్నారు. పెండింగ్ బిల్లుల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తెదేపా నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.


ఇదీ చదవండి : శీతల గిడ్డంగుల యజమానుల నిర్లక్ష్యం.. మిర్చి రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.