వారిది నిరుపేద కుటుంబం. కూలీ చేస్తే కానీ వారి పొట్ట నిండదు. తమకున్న పొలాన్నంత అమ్మకుని తమ ఎనిమిది నెలల కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు శస్త్రచికిత్స చేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామానికి చెందిన దేవల్ల శ్రీనివాసులు, సుప్రజ దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ బాబుకు గుండె సంబంధిత సమస్య రావడంతో తమకున్న మూడెకరాల పొలం అమ్మి ఆ రూ.5లక్షలతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించారు. ఇక తమ బిడ్డకు ప్రాణాపాయం తప్పిందని ఆ తల్లిదండ్రలు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. రెండు నెలల్లోనే తిరిగి హాస్పిటల్కు చెకప్కు వెళ్లగా ఆపరేషన్ ఫెయిల్ అయిందని వైద్యులు తెలిపారు. తిరిగి నెలరోజుల్లో రీ ఆపరేషన్ చేయకుంటే బాబు ప్రాణాలకే ముప్పని... శస్త్రచికిత్సకు మరో రూ.3లక్షలు ఖర్చువుతుందని వైద్యులు తెలిపారు.
రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబానికి రీ ఆపరేషన్ కోసం డబ్బులు ఎలా సమకూర్చాలో అర్థంకాక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దయ గల దాతలు స్పందించి సహాయం అందించి తమ బాబు ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: