ETV Bharat / state

రోగులను గాలికొదిలేసి... వైద్యులు ఏం చేశారంటే..! - సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వార్తలు

ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సెలవులపై వెళ్లారు. రోగుల బాగోగులు చూసేందుకు జూనియర్ వైద్యులను నియమించారు. కానీ వారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి సరదాగా బంతి ఆట ఆడుకున్నారు. నెల్లూరు జిల్లా సంగంలో జూనియర్​ వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Doctors played ball game while on duty
ఆటలు ఆడుతున్న వైద్యులు
author img

By

Published : Dec 9, 2019, 7:56 PM IST

నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూనియర్ వైద్యుల తీరు విమర్శలకు దారి తీసింది. పీహెచ్​సీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు డాక్టర్లు ప్రతిమ, శ్రీనివాసుల రెడ్డి సెలవుపై వెళ్లటంతో ఉన్నతాధికారులు రోగులకు చికిత్స అందించేందుకు జూనియర్​ డాక్టర్లకు విధులు కేటాయించారు. అయితే ఉదయం 10 గంటల నుంచి విధులు నిర్వహించాల్సిన జూనియర్ డాక్టర్లు... ఆసుపత్రి ప్రాంగణంలో బంతి ఆట ఆడుకున్నారు. వైద్యం కోసం వచ్చిన రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇది చూసిన జనాలు విస్తుపోయి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

విధులు గాలికొదిలేసి... వైద్యుల బంతి ఆట

నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూనియర్ వైద్యుల తీరు విమర్శలకు దారి తీసింది. పీహెచ్​సీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు డాక్టర్లు ప్రతిమ, శ్రీనివాసుల రెడ్డి సెలవుపై వెళ్లటంతో ఉన్నతాధికారులు రోగులకు చికిత్స అందించేందుకు జూనియర్​ డాక్టర్లకు విధులు కేటాయించారు. అయితే ఉదయం 10 గంటల నుంచి విధులు నిర్వహించాల్సిన జూనియర్ డాక్టర్లు... ఆసుపత్రి ప్రాంగణంలో బంతి ఆట ఆడుకున్నారు. వైద్యం కోసం వచ్చిన రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇది చూసిన జనాలు విస్తుపోయి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

విధులు గాలికొదిలేసి... వైద్యుల బంతి ఆట

ఇదీ చదవండి:

'న్యాయం చేయండి.. లేకుంటే ఆత్మహత్యకు అనుమతివ్వండి..!'

Intro:Ap_nlr_12_09_Dr la nirvakam_av_AP10061Body:యాంకర్ వాయిస్: ప్రాణం పోసే వైద్యులు రోగుల ప్రాణాలను గాల్లోకి వదిలేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రోగులు వెను తిరిగిన సంఘటన నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చోటు చేసుకుంది. పీహెచ్ సీ లో విధులు నిర్వహిస్తున్న ప్రతిమ, శ్రీనివాసుల రెడ్డి ఇద్దరు డాక్టర్లు సెలవుపై వెళ్లడంతో ఉన్నతాధికారులు రోగుల ఆరోగ్య దృష్ట్యా జూనియర్ డాక్టర్‌ లను విధులకు నిర్వహించారు. అయితే ఉదయం 10 గంటల నుంచి విధులు నిర్వహించాల్సిన జూనియర్ డాక్టర్లు తమకేమి పట్టదంటూ వచ్చిన రోగులు సైతం పట్టించుకోకుండా ఆసుపత్రి ప్రాంగణంలో బంతి ఆట ఆడుతూ పాడుతూ చెట్టా పట్టాలేశారు. ప్రస్తుతం కార్పొరేట్ వైద్యశాలల్లో సామాన్య ప్రజలకు వైద్యం ఆకాశాన్నంతుండడంతో వారికి దిక్కుగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో కూడా ఇలా వైద్యం అందక ఇలాంటి ఈ సంఘటనలు చోటు చేసుకుంటుండడటం చూసి జనాలు విస్తుపోయి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.