ETV Bharat / state

కృష్ణపట్నం కారిడార్‌కు రూ.533.86 కోట్లు విడుదల

author img

By

Published : Feb 9, 2023, 10:28 PM IST

Krishnapatnam Corridor: చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్​లో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం వాటా కింద రూ.533.86 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్‌ తెలిపారు.రాజంపేట ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Etv Bharat
Etv Bharat

Krishnapatnam Corridor: చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్​లో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం వాటా కింద రూ.533.86 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్‌ తెలిపారు. రాజంపేట ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కృష్ణపట్నం కారిడార్ కు సంబంధించి 12,798 ఎకరాలకు సమగ్ర బృహత్తర ప్రణాళిక, ప్రాథమిక ఆకృతి ఇప్పటికే పూర్తయ్యాయని, అందులో 2,500 ఎకరాలను మొదటి దశకు గుర్తించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన 2,139 ఎకరాలకు పర్యావరణ అనుమతులు పొందినట్లు వెల్లడించారు.

పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ల ఏర్పాటు: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన 474 పాఠశాలలకుగాను 372 బడుల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు సమకూర్చినట్లు కేంద్ర ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

38,901 గ్రామాలకు అందని మొబైల్‌ సేవలు: దేశవ్యాప్తంగా 2022, మార్చి నాటికి 38,901 గ్రామాలకు మొబైల్‌ సేవలు అందడం లేదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హా చౌహాన్‌ తెలిపారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 2,971 గ్రామాలకు మొబైల్‌ సేవలు అందడం లేదని మంత్రి పేర్కొన్నారు.

ఏపీలో నాలుగు గతిశక్తి కార్గో టెర్మినళ్ల ఏర్పాటు: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు గతిశక్తి కార్గో టెర్మినళ్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. చిత్తూరు, రాజంపేట ఎంపీలు ఎన్‌.రెడ్డప్ప, పి.వి.మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఆత్రేయపురం పూతరేకులభౌగోళిక గుర్తింపుపై చర్చ: ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ఇవ్వాలని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఆత్రేయపురం పూతరేకుల తయారీ సంక్షేమ సంఘం 2021లోనే దరఖాస్తు చేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్‌ తెలిపారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఇది పాక్షిక న్యాయ ప్రక్రియతో కూడిన అంశమని, 1999 నాటి జీఐ చట్టం నియమ నిబంధనలతో ముడిపడి ఉందని మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చదవండి

Krishnapatnam Corridor: చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్​లో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం వాటా కింద రూ.533.86 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్‌ తెలిపారు. రాజంపేట ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కృష్ణపట్నం కారిడార్ కు సంబంధించి 12,798 ఎకరాలకు సమగ్ర బృహత్తర ప్రణాళిక, ప్రాథమిక ఆకృతి ఇప్పటికే పూర్తయ్యాయని, అందులో 2,500 ఎకరాలను మొదటి దశకు గుర్తించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన 2,139 ఎకరాలకు పర్యావరణ అనుమతులు పొందినట్లు వెల్లడించారు.

పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ల ఏర్పాటు: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన 474 పాఠశాలలకుగాను 372 బడుల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు సమకూర్చినట్లు కేంద్ర ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

38,901 గ్రామాలకు అందని మొబైల్‌ సేవలు: దేశవ్యాప్తంగా 2022, మార్చి నాటికి 38,901 గ్రామాలకు మొబైల్‌ సేవలు అందడం లేదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హా చౌహాన్‌ తెలిపారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 2,971 గ్రామాలకు మొబైల్‌ సేవలు అందడం లేదని మంత్రి పేర్కొన్నారు.

ఏపీలో నాలుగు గతిశక్తి కార్గో టెర్మినళ్ల ఏర్పాటు: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు గతిశక్తి కార్గో టెర్మినళ్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. చిత్తూరు, రాజంపేట ఎంపీలు ఎన్‌.రెడ్డప్ప, పి.వి.మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఆత్రేయపురం పూతరేకులభౌగోళిక గుర్తింపుపై చర్చ: ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ఇవ్వాలని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఆత్రేయపురం పూతరేకుల తయారీ సంక్షేమ సంఘం 2021లోనే దరఖాస్తు చేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్‌ తెలిపారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఇది పాక్షిక న్యాయ ప్రక్రియతో కూడిన అంశమని, 1999 నాటి జీఐ చట్టం నియమ నిబంధనలతో ముడిపడి ఉందని మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.