నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజుపాళెంలో దీపోగు వెంకటరమణయ్య ఇంటికి చెన్నై నుంచి బంధువులు వచ్చారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల చెన్నై నుంచి వచ్చిన వారి సమాచారాన్ని అక్కడి వాలంటీర్ మస్తానయ్య... పైఅధికారులకు సమాచారం అందించాడు. వెంకటరమణయ్యకు అధికారులు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలింది. వెంటనే ఆ గ్రామాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు.
వాలంటీర్ పై దాడి... ముగ్గురిపై కేసు నమోదు
ఆత్మకూరు మండలం బసవరాజుపాళెంలో వాలంటీర్పై ముగ్గురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. చెన్నై నుంచి గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని వాలంటీర్ తన పైఅధికారులకు అందించాడు. ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పావంటూ వాలంటీర్పై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
![వాలంటీర్ పై దాడి... ముగ్గురిపై కేసు నమోదు ఆత్మకూరు మండలంలో వాలంటీర్ పై దాడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7543191-854-7543191-1591704586922.jpg?imwidth=3840)
రెండు రోజుల తర్వాత మరోసారి అతనికి పరీక్ష చేయగా నెగిటివ్ రావటంతో ఇంటికి పంపించారు. అప్పటి నుంచి వాలంటీర్ మీద వెంకటరమణయ్య కక్ష పెంచుకున్నాడు. మేము ఎక్కడి నుంచి వస్తే నీకెందుకంటూ... వాలంటీర్పై వెంకటరమణయ్య అతని బంధువులతో కలిసి దాడి చేశాడు. తనపై దాడికి పాల్పడిన వారిపై వాలంటీర్ మస్తానయ్య... ఉన్నఅధికారులకు తెలియజేశాడు. ఈ ముగ్గురి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: తోటి ఏనుగులతో పోరాడి గజరాజు మృతి!
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజుపాళెంలో దీపోగు వెంకటరమణయ్య ఇంటికి చెన్నై నుంచి బంధువులు వచ్చారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల చెన్నై నుంచి వచ్చిన వారి సమాచారాన్ని అక్కడి వాలంటీర్ మస్తానయ్య... పైఅధికారులకు సమాచారం అందించాడు. వెంకటరమణయ్యకు అధికారులు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలింది. వెంటనే ఆ గ్రామాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు.
రెండు రోజుల తర్వాత మరోసారి అతనికి పరీక్ష చేయగా నెగిటివ్ రావటంతో ఇంటికి పంపించారు. అప్పటి నుంచి వాలంటీర్ మీద వెంకటరమణయ్య కక్ష పెంచుకున్నాడు. మేము ఎక్కడి నుంచి వస్తే నీకెందుకంటూ... వాలంటీర్పై వెంకటరమణయ్య అతని బంధువులతో కలిసి దాడి చేశాడు. తనపై దాడికి పాల్పడిన వారిపై వాలంటీర్ మస్తానయ్య... ఉన్నఅధికారులకు తెలియజేశాడు. ఈ ముగ్గురి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.