ETV Bharat / state

రాజధాని భూములు దిగమింగేందుకు ప్రభుత్వం కుట్ర: ఏలూరి సాంబశివరావు

author img

By

Published : Oct 21, 2022, 5:46 PM IST

TDP MLA FIRES ON YSRCP: రాజధాని నిర్మాణానికి సేకరించిన భూములను దిగమింగేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. రాజధాని భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని న్యాయస్థానాలు తప్పుపట్టినా దొడ్డిదారిలో ఆర్డినెన్స్‌ తేవడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలనీ.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి వచ్చినన్ని ఓట్లు కూడా వైకాపాకు రావని హెచ్చరించారు.

ap capital
tdp mla

TDP MLA Yeluri Sambasiva Rao Fires on YSRCP: రాజధాని నిర్మాణానికి సేకరించిన భూములను దిగమింగేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. రాజధాని భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని న్యాయస్థానాలు తప్పుపట్టినా దొడ్డిదారిలో ఆర్డినెన్స్‌ తేవడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాలపై ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల కోసం చేసిన చట్టాలను వైకాపా నేతల భూదాహాన్ని తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలనీ.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి వచ్చినన్ని ఓట్లు కూడా వైకాపాకు రావని హెచ్చరించారు.

TDP MLA Yeluri Sambasiva Rao Fires on YSRCP: రాజధాని నిర్మాణానికి సేకరించిన భూములను దిగమింగేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. రాజధాని భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని న్యాయస్థానాలు తప్పుపట్టినా దొడ్డిదారిలో ఆర్డినెన్స్‌ తేవడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాలపై ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల కోసం చేసిన చట్టాలను వైకాపా నేతల భూదాహాన్ని తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలనీ.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి వచ్చినన్ని ఓట్లు కూడా వైకాపాకు రావని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.