ETV Bharat / state

జగ్గయపేట కౌన్సిల్​ సమావేశంలో ఉద్రిక్తత.. టీడీపీ కౌన్సిలర్లు అరెస్ట్​

Jaggayyapeta Councilors Arrest : ఎన్టీఆర్​ జిల్లాలోని జగ్గయ్యపేట కౌన్సిల్​ సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరపాలక సంస్థ అనుమతి లేకుండా అక్రమంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించినందుకు.. ఛైర్మన్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రశ్నించిన టీడీపీ కౌన్సిలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Feb 28, 2023, 4:42 PM IST

TDP Councilors Arrest
టీడీపీ కౌన్సిలర్ల అరెస్ట్​
జగ్గయ్యపేటలో టీడీపీ కౌన్సిలర్ల అరెస్టు

Jaggayyapeta TDP Councilors Arrest : ఎన్టీఆర్​ జిల్లాలోని జగ్గయ్యపేట కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కౌన్సిలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్​ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో.. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్​లో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా మాజీ సర్పంచ్​ విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వారు సమావేశంలో నేలపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ క్రమంలో సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కౌన్సిల్​ సమావేశానికి ఆటంకం కలిగిస్తున్నారని నగర పాలక ఛైర్మన్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు టీడీపీ కౌన్సిలర్లను అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. తమపై వైసీపీ కౌన్సిలర్లు దాడి చేశారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. వైసీపీ పాలక పక్షం చర్యలను టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్​ తాతయ్య ఖండించారు.

పోలీసులు అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించిన తర్వాత కూడా టీడీపీ కౌన్సిలర్లు తమ నిరసనను కొనసాగించారు. స్టేషన్​కు తరలించిన తర్వాత టీడీపీ కౌన్సిలర్లు పోలీస్​ స్టేషన్​ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేకంగా పోలీసులు కౌన్సిల్​ సమావేశంలోకి ప్రవేశించారని కౌన్సిలర్లు అన్నారు. పోలీసులు కౌన్సిల్​ సమావేశంలో వచ్చిన వీడియోలను న్యాయస్థానంలో ప్రవేశపెడతామని వారు తెలిపారు.

ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. అన్యాయం జరుగుతోందని ప్రశ్నించినందుకు.. మాపై దాడికి దిగారని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. కౌన్సిల్​లో జరిగిందంతా ప్రజలు చూశారన్నారు. కౌన్సిల్​లో అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం చెప్పలేదని తెలిపారు. అంతేకాకుండా అడిగినందుకు ఇలా మాపై దాడులు చేస్తున్నారని వాపోయారు. సుందరీకరణ పేరుతో ఏజెండా పెట్టి.. రాత్రులకు రాత్రులు విగ్రహాలు ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు.

ప్రైవేటు వ్యక్తుల విగ్రహాలు.. ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటు చేయటం ఏంటనీ మండిపడ్డారు. విగ్రహన్ని ఏర్పాటు చేయాలని భావిస్తే వారి సొంత స్థలాలలో.. అందుకు ఏర్పాట్లు చేయాలి తప్ప ఇలా ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటు సరికాదని అన్నారు. ఇదే విషయాన్ని మేము ఛైర్​పర్సన్​ను ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేక మాపై కొందరు వైసీపీ కౌన్సిలర్లు దాడి చేశారన్నారు. అంతేకాకుండా మేమే దాడి చేశామని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. పోలీసులు కూడా జరిగింది తెలుసుకోకుండా మమ్మల్ని అరెస్టు చేసి తీసుకురావటం దుర్మార్గమని ఆరోపించారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలను వైసీపీ మానుకోకపోతే.. ప్రతిపక్షంగా పోరాడుతునే ఉంటామని తెలిపారు.

ఇవీ చదవండి :

జగ్గయ్యపేటలో టీడీపీ కౌన్సిలర్ల అరెస్టు

Jaggayyapeta TDP Councilors Arrest : ఎన్టీఆర్​ జిల్లాలోని జగ్గయ్యపేట కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కౌన్సిలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్​ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో.. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్​లో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా మాజీ సర్పంచ్​ విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వారు సమావేశంలో నేలపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ క్రమంలో సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కౌన్సిల్​ సమావేశానికి ఆటంకం కలిగిస్తున్నారని నగర పాలక ఛైర్మన్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు టీడీపీ కౌన్సిలర్లను అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. తమపై వైసీపీ కౌన్సిలర్లు దాడి చేశారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. వైసీపీ పాలక పక్షం చర్యలను టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్​ తాతయ్య ఖండించారు.

పోలీసులు అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించిన తర్వాత కూడా టీడీపీ కౌన్సిలర్లు తమ నిరసనను కొనసాగించారు. స్టేషన్​కు తరలించిన తర్వాత టీడీపీ కౌన్సిలర్లు పోలీస్​ స్టేషన్​ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేకంగా పోలీసులు కౌన్సిల్​ సమావేశంలోకి ప్రవేశించారని కౌన్సిలర్లు అన్నారు. పోలీసులు కౌన్సిల్​ సమావేశంలో వచ్చిన వీడియోలను న్యాయస్థానంలో ప్రవేశపెడతామని వారు తెలిపారు.

ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. అన్యాయం జరుగుతోందని ప్రశ్నించినందుకు.. మాపై దాడికి దిగారని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. కౌన్సిల్​లో జరిగిందంతా ప్రజలు చూశారన్నారు. కౌన్సిల్​లో అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం చెప్పలేదని తెలిపారు. అంతేకాకుండా అడిగినందుకు ఇలా మాపై దాడులు చేస్తున్నారని వాపోయారు. సుందరీకరణ పేరుతో ఏజెండా పెట్టి.. రాత్రులకు రాత్రులు విగ్రహాలు ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు.

ప్రైవేటు వ్యక్తుల విగ్రహాలు.. ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటు చేయటం ఏంటనీ మండిపడ్డారు. విగ్రహన్ని ఏర్పాటు చేయాలని భావిస్తే వారి సొంత స్థలాలలో.. అందుకు ఏర్పాట్లు చేయాలి తప్ప ఇలా ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటు సరికాదని అన్నారు. ఇదే విషయాన్ని మేము ఛైర్​పర్సన్​ను ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేక మాపై కొందరు వైసీపీ కౌన్సిలర్లు దాడి చేశారన్నారు. అంతేకాకుండా మేమే దాడి చేశామని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. పోలీసులు కూడా జరిగింది తెలుసుకోకుండా మమ్మల్ని అరెస్టు చేసి తీసుకురావటం దుర్మార్గమని ఆరోపించారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలను వైసీపీ మానుకోకపోతే.. ప్రతిపక్షంగా పోరాడుతునే ఉంటామని తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.