ETV Bharat / state

CM JAGAN PROMISEES: ఉమ్మడి కృష్ణా జిల్లాపై సీఎం జగన్ వరాలు.. నేటికీ నేరవేరని హామీలు

AP CM Jagan promises Krishna district Updates: ముఖ్యమంత్రి జగన్‌పై ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారులు, ఆలయాల అభివృద్ధి, మంచినీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం వరాలు కురిపించి.. నేటికీ ఎటువంటి నిధులు విడుదల చేయకుండా మోసం చేశారని ఆవేదన చెందుతున్నారు.

author img

By

Published : May 29, 2023, 4:36 PM IST

Updated : May 29, 2023, 5:12 PM IST

AP CM Jagan
AP CM Jagan
ఉమ్మడి కృష్ణా జిల్లాపై సీఎం జగన్ వరాలు.. నేటికీ నేరవేరని హామీలు

AP CM Jagan promises Krishna district Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు విచ్చేసిన ప్రతిసారీ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామంటూ వరాల మీద వరాలు కురిపించారని.. ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోవటం లేదని దుయ్యబడుతున్నారు. రెండు జిల్లాల్లోని రహదారులు, ఆలయాల అభివృద్ధి, మంచినీటి ప్రాజెక్టులతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు వందల కోట్ల నిధులను విడుదల చేస్తామంటూ గతంలో జగన్‌ ప్రకటించారని.. నేటికీ ఆ హామీలు నెరవేరలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఇచ్చిన హామీలను వెంటనే నేరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాపై జగన్ వరాలు.. ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రంలో ఏ జిల్లాలో పర్యటించినా ఆ జిల్లాపై నిధుల వరాలు కురిపిస్తారు. ప్రతి అన్న, అక్కాచెల్లెమ్మలకు అండగా ఉంటామని, రహదారులు, ఆలయాల అభివృద్ధి, మంచినీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని హామీల మీద హామీలు ఇస్తారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తెగ ఆశలు పెంచుకుని చివరకు నిరాశల పాలవుతున్నారు. సీఎం జగన్ ప్రకటించిన హామీలన్నీ నీటి మూటలేనని తెలిసి మండిపడుతున్నారు. ఈ మేరకు గత ఏడాది అక్టోబరు 20వ తేదీన కృష్ణా జిల్లా అవనిగడ్డకు ముఖ్యమంత్రి జగన్‌ విచ్చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం వరాల జల్లులు కురిపిస్తున్నానని.. ఏకంగా రూ. 93 కోట్లను రకరకాల పనుల కోసం మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ నిధుల్లో.. అవనిగడ్డ, కోడూరు మధ్య రహదారి అభివృద్ధికి రూ.35 కోట్లు, కృష్ణా నది కుడి, ఎడమ కరకట్టతో పాటు సముద్ర కరకట్టను పటిష్ఠ పరిచేందుకు రూ. 25 కోట్లు, పాత ఎడ్లంక వారథి కోసం రూ. 8.50 కోట్లు, కంపోస్టు యార్డును తరలించడానికి రూ. 10 కోట్లు, సీసీ డ్రైన్ల ఏర్పాటుకు రూ. 15 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఇప్పటికి ఏడు నెలలు పూర్తవుతున్నా.. ఒక్క పనికి కూడా నిధులు కేటాయించలేదు.

పెడనలో సీఎం జగన్​ సభకు వచ్చి మహిళ మృతి

ముఖ్యమంత్రి హామీలపై ఆశలు-విడుదల కాని నిధులు.. ముఖ్యమంత్రి జగనే స్వయంగా నిధులు కేటాయిస్తామని ప్రకటించడంతో.. తమ సమస్యలు పరిష్కరమౌతాయని ప్రజలు తెగ ఆనందపడ్డారు. నిధులు వస్తాయని ఆశగా రోజులు తరబడి ఎదురు చూశారు. అయినా, నేటికీ నిధులు విడుదల కాకపోవడంతో నిరాశ చెందారు. గత ఏడాది ఆగస్టు 25న పెడనకు ముఖ్యమంత్రి జగన్‌ విచ్చేసి.. పలు అభివృద్ధి పనులకు రూ. 102 కోట్లను ఇస్తానంటూ మరోసారి హామీ ఇచ్చారు. కానీ.. ఏ ఒక్క పనికి కూడా ఇంతవరకూ నిధులు మంజూరు చేయలేదు. పెడనలో జరిగిన సభా వేదికపైనే.. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్‌ తన నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. వాటికి నిధులు ఇవ్వాలంటూ కోరారు. దానికి జగన్‌ నవ్వుతూ.. సరే ఇస్తానంటూ హామీ ఇచ్చారు. రహదారులు, డ్రైనేజీ, ప్రహరీ నిర్మాణాలు, నీటి సరఫరా, వంతెనలు, బీటీ రోడ్లు.. ఇలా అనేక అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా జోగి చదువుతూ ముఖ్యమంత్రిని కోరుతుంటే.. ఆయన సరేనంటూ వరాల జల్లులు కురిపించారు. అదే వేదికపై మచిలీపట్నం పోర్టు పనులను త్వరలో ప్రారంభిస్తానంటూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. అనంతరం తొమ్మిది నెలల తర్వాత తాజాగా పోర్టు పనులను ప్రారంభించారు.

Foundation stone for Bandar Port: బందర్ పోర్టుకు వందల ఏళ్ల నౌకాయాన చరిత్ర : సీఎం జగన్

సీఎం ప్రకటనతో విజయనగరం వాసులు కేరింతలు .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విజయవాడ నగర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి.. పలు అభివృద్ధి పనుల నివేదికలను సమర్పించారు. దీంతో వాటి కోసం తొలుత రూ. 50 కోట్లను విజయవాడకు కేటాయిస్తున్నట్టు సీఎం హామీ ప్రకటించారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఉబ్బితబ్బిబ్బయిపోయి నగరం రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయంటూ ప్రకటనలు గుప్పించారు. రూ. 50 కోట్లతో నగరంలోని 88 పనులను మూడు సర్కిళ్ల పరిధిలో చేపట్టాలని ప్రణాళికలు రూపొందించారు. సర్కిల్‌-1లో 18 పనులు, సర్కిల్‌-2లో 29, సర్కిల్‌-3లో 41 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యానవనాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, కాలువల సుందరీకరణ, క్రీడలకు వసతుల కల్పన, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, యూజీడీ లైన్ల ఏర్పాటు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ కమ్‌ ఫంక్షన్‌ హాళ్లు, ఓపెన్‌ జిమ్, అంతరత డ్రెయిన్లు.. లాంటి పనులన్నీ పూర్తి చేస్తామని టెండర్లు పిలిచారు.

ఆగిపోయిన టెండర్లు..నిలిచిన పనులు.. ఆ తర్వాత విజయవాడకు మరో రూ. 100 కోట్లను ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రహదారులు, సామాజిక భవనాలు, గ్రంథాలయాలు, సీవేజీ లైన్లు.. లాంటి 99 పనులు ఈ నిధులతో చేపడతామన్నారు. కానీ, రూ. 150 కోట్లలో మూడేళ్లవుతున్నా కనీసం రూ. 30 కోట్లు కూడా రాలేదు. దీంతో చాలా వరకూ పనులు టెండర్ల దశలోనే ఆగిపోయాయి. ఇప్పుడు ఈ పనులకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే చేసిన కొన్ని పనులకే బిల్లులు రాలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే నిధులతోనే నగరాభివృద్ధికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

రోడ్లు బాగు చేయండి మహాప్రభో.. కృష్ణా జిల్లాకు చెందిన పెడన గ్రామంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో వాహనాదారులు, స్థానికులు దూళీతో, దుమ్ముతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏదైనా అత్యవసర రీత్యా జిల్లాకు వెళ్లాలంటే చుక్కలు చూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆవేదన చెందుతున్నారు. సీఎం జగన్ బహిరంగ సభలో ప్రకటించిన రూ. 93 కోట్లను విడుదల చేసి, తమ ప్రాంతానికి సరైన రహదారులను వేయాలని ఇక్కడి స్థానికులు కోరుతున్నారు.

MLA Perni Nani on Retirement: 'హా..అందుకే రిటైర్​ అవుతున్నా​..!' పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి కృష్ణా జిల్లాపై సీఎం జగన్ వరాలు.. నేటికీ నేరవేరని హామీలు

AP CM Jagan promises Krishna district Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు విచ్చేసిన ప్రతిసారీ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామంటూ వరాల మీద వరాలు కురిపించారని.. ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోవటం లేదని దుయ్యబడుతున్నారు. రెండు జిల్లాల్లోని రహదారులు, ఆలయాల అభివృద్ధి, మంచినీటి ప్రాజెక్టులతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు వందల కోట్ల నిధులను విడుదల చేస్తామంటూ గతంలో జగన్‌ ప్రకటించారని.. నేటికీ ఆ హామీలు నెరవేరలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఇచ్చిన హామీలను వెంటనే నేరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాపై జగన్ వరాలు.. ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రంలో ఏ జిల్లాలో పర్యటించినా ఆ జిల్లాపై నిధుల వరాలు కురిపిస్తారు. ప్రతి అన్న, అక్కాచెల్లెమ్మలకు అండగా ఉంటామని, రహదారులు, ఆలయాల అభివృద్ధి, మంచినీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని హామీల మీద హామీలు ఇస్తారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తెగ ఆశలు పెంచుకుని చివరకు నిరాశల పాలవుతున్నారు. సీఎం జగన్ ప్రకటించిన హామీలన్నీ నీటి మూటలేనని తెలిసి మండిపడుతున్నారు. ఈ మేరకు గత ఏడాది అక్టోబరు 20వ తేదీన కృష్ణా జిల్లా అవనిగడ్డకు ముఖ్యమంత్రి జగన్‌ విచ్చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం వరాల జల్లులు కురిపిస్తున్నానని.. ఏకంగా రూ. 93 కోట్లను రకరకాల పనుల కోసం మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ నిధుల్లో.. అవనిగడ్డ, కోడూరు మధ్య రహదారి అభివృద్ధికి రూ.35 కోట్లు, కృష్ణా నది కుడి, ఎడమ కరకట్టతో పాటు సముద్ర కరకట్టను పటిష్ఠ పరిచేందుకు రూ. 25 కోట్లు, పాత ఎడ్లంక వారథి కోసం రూ. 8.50 కోట్లు, కంపోస్టు యార్డును తరలించడానికి రూ. 10 కోట్లు, సీసీ డ్రైన్ల ఏర్పాటుకు రూ. 15 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఇప్పటికి ఏడు నెలలు పూర్తవుతున్నా.. ఒక్క పనికి కూడా నిధులు కేటాయించలేదు.

పెడనలో సీఎం జగన్​ సభకు వచ్చి మహిళ మృతి

ముఖ్యమంత్రి హామీలపై ఆశలు-విడుదల కాని నిధులు.. ముఖ్యమంత్రి జగనే స్వయంగా నిధులు కేటాయిస్తామని ప్రకటించడంతో.. తమ సమస్యలు పరిష్కరమౌతాయని ప్రజలు తెగ ఆనందపడ్డారు. నిధులు వస్తాయని ఆశగా రోజులు తరబడి ఎదురు చూశారు. అయినా, నేటికీ నిధులు విడుదల కాకపోవడంతో నిరాశ చెందారు. గత ఏడాది ఆగస్టు 25న పెడనకు ముఖ్యమంత్రి జగన్‌ విచ్చేసి.. పలు అభివృద్ధి పనులకు రూ. 102 కోట్లను ఇస్తానంటూ మరోసారి హామీ ఇచ్చారు. కానీ.. ఏ ఒక్క పనికి కూడా ఇంతవరకూ నిధులు మంజూరు చేయలేదు. పెడనలో జరిగిన సభా వేదికపైనే.. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్‌ తన నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. వాటికి నిధులు ఇవ్వాలంటూ కోరారు. దానికి జగన్‌ నవ్వుతూ.. సరే ఇస్తానంటూ హామీ ఇచ్చారు. రహదారులు, డ్రైనేజీ, ప్రహరీ నిర్మాణాలు, నీటి సరఫరా, వంతెనలు, బీటీ రోడ్లు.. ఇలా అనేక అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా జోగి చదువుతూ ముఖ్యమంత్రిని కోరుతుంటే.. ఆయన సరేనంటూ వరాల జల్లులు కురిపించారు. అదే వేదికపై మచిలీపట్నం పోర్టు పనులను త్వరలో ప్రారంభిస్తానంటూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. అనంతరం తొమ్మిది నెలల తర్వాత తాజాగా పోర్టు పనులను ప్రారంభించారు.

Foundation stone for Bandar Port: బందర్ పోర్టుకు వందల ఏళ్ల నౌకాయాన చరిత్ర : సీఎం జగన్

సీఎం ప్రకటనతో విజయనగరం వాసులు కేరింతలు .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విజయవాడ నగర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి.. పలు అభివృద్ధి పనుల నివేదికలను సమర్పించారు. దీంతో వాటి కోసం తొలుత రూ. 50 కోట్లను విజయవాడకు కేటాయిస్తున్నట్టు సీఎం హామీ ప్రకటించారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఉబ్బితబ్బిబ్బయిపోయి నగరం రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయంటూ ప్రకటనలు గుప్పించారు. రూ. 50 కోట్లతో నగరంలోని 88 పనులను మూడు సర్కిళ్ల పరిధిలో చేపట్టాలని ప్రణాళికలు రూపొందించారు. సర్కిల్‌-1లో 18 పనులు, సర్కిల్‌-2లో 29, సర్కిల్‌-3లో 41 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యానవనాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, కాలువల సుందరీకరణ, క్రీడలకు వసతుల కల్పన, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, యూజీడీ లైన్ల ఏర్పాటు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ కమ్‌ ఫంక్షన్‌ హాళ్లు, ఓపెన్‌ జిమ్, అంతరత డ్రెయిన్లు.. లాంటి పనులన్నీ పూర్తి చేస్తామని టెండర్లు పిలిచారు.

ఆగిపోయిన టెండర్లు..నిలిచిన పనులు.. ఆ తర్వాత విజయవాడకు మరో రూ. 100 కోట్లను ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రహదారులు, సామాజిక భవనాలు, గ్రంథాలయాలు, సీవేజీ లైన్లు.. లాంటి 99 పనులు ఈ నిధులతో చేపడతామన్నారు. కానీ, రూ. 150 కోట్లలో మూడేళ్లవుతున్నా కనీసం రూ. 30 కోట్లు కూడా రాలేదు. దీంతో చాలా వరకూ పనులు టెండర్ల దశలోనే ఆగిపోయాయి. ఇప్పుడు ఈ పనులకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే చేసిన కొన్ని పనులకే బిల్లులు రాలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే నిధులతోనే నగరాభివృద్ధికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

రోడ్లు బాగు చేయండి మహాప్రభో.. కృష్ణా జిల్లాకు చెందిన పెడన గ్రామంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో వాహనాదారులు, స్థానికులు దూళీతో, దుమ్ముతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏదైనా అత్యవసర రీత్యా జిల్లాకు వెళ్లాలంటే చుక్కలు చూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆవేదన చెందుతున్నారు. సీఎం జగన్ బహిరంగ సభలో ప్రకటించిన రూ. 93 కోట్లను విడుదల చేసి, తమ ప్రాంతానికి సరైన రహదారులను వేయాలని ఇక్కడి స్థానికులు కోరుతున్నారు.

MLA Perni Nani on Retirement: 'హా..అందుకే రిటైర్​ అవుతున్నా​..!' పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Last Updated : May 29, 2023, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.