కర్నూలు పర్యటనలో నారా లోకేశ్ వ్యాఖ్యలపై వైకాపా మండిపడింది. లోకేశ్ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా.. అభ్యంతరకరంగా ఉన్నాయని..కనీసం విజ్ఞత లేకుండా సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి మాట్లాడారని ఆ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ముఖ్యమంత్రిపై లోకేశ్ దుర్భాషలాడటం అందరినీ బాధించిందని, మాట్లాడిన మాటలకు గాను చంద్రబాబు సహా లోకేశ్ లెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో హత్యారాజకీయాలను ప్రోత్సాహించింది తెదేపానని సుధాకర్ బాబు విమర్శించారు.
ఇదీ చదవండి:
container house: గ్రామాల్లోనూ కంటైనర్ ఇళ్లకు పెరుగుతున్న ఆదరణ