ETV Bharat / state

కొవిడ్‌ టీకాపై చేసే వ్యయం వృథా: వైకాపా ఎంపీ సంజీవ్‌ కుమార్‌ - undefined

కొవిడ్‌ టీకాపై చేసే వ్యయం వృథా అని వైకాపా ఎంపీ సంజీవ్‌ కుమార్‌ లోక్ సభలో వ్యాఖ్యానించారు. వైద్యునిగా తన దృష్టిలో.. ఆ ఖర్ఛు వృథా అని అభిప్రాయపడ్డారు.

YCP MP Sanjeev Kumar
YCP MP Sanjeev Kumar
author img

By

Published : Mar 18, 2021, 1:18 PM IST

కొవిడ్‌ టీకాపై చేసే వ్యయం వృథా అని వైకాపా కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ అన్నారు. కేంద్రబడ్జెట్‌లో ఆరోగ్య, కుటుంబసంక్షేమ పద్దులపై లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

‘కొవిడ్‌-19 లాంటివి వందేళ్లకోసారి వస్తాయి. వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వొద్దు. కొవిడ్‌-19 టీకాకు రూ.35వేల కోట్లు వెచ్చించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వైద్యునిగా నా దృష్టిలో అదంతా వృథా వ్యయం. కొవిడ్‌ టీకా 6-9 నెలల పాటు మాత్రమే సహాయపడుతుంది. తర్వాత ఆ రూ.35వేల కోట్లు ఆవిరైపోతాయి. ఆ మొత్తాన్ని ప్రాథమిక ఆరోగ్య రక్షణకు మళ్లించాలి. అది దేశానికి ఎంతో అవసరం. కొవిడ్‌కు విశ్వజనీనమైన టీకా సాధ్యం కాదు. కాబట్టి అంత మొత్తం వెచ్చించొద్దు. రాష్ట్రంలో కొత్త 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. కేంద్ర ప్రభుత్వం ఆ కళాశాలలకు నిధులివ్వాలి. దేశంలో 70% ప్రజలు గ్రామాల్లో ఉంటే.. అక్కడ 30% మాత్రమే అర్హులైన వైద్యులున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వైద్యులు వెళ్లేందుకు వారికి పన్నులు, పరికరాల కొనుగోళ్లు, విద్యుత్తు బిల్లుల్లో రాయితీ ఇవ్వాలి. మిక్సోపతితో ఆయుర్వేద వైద్యులు సర్జన్లు అయితే ఎంతో ప్రమాదం. ఈ విషయంపై పునరాలోచించండి. మంగళగిరి ఎయిమ్స్‌ వేగంగా పూర్తిచేసేందుకు నిధులు కేటాయించండి. కడప, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించండి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

కొవిడ్‌ టీకాపై చేసే వ్యయం వృథా అని వైకాపా కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ అన్నారు. కేంద్రబడ్జెట్‌లో ఆరోగ్య, కుటుంబసంక్షేమ పద్దులపై లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

‘కొవిడ్‌-19 లాంటివి వందేళ్లకోసారి వస్తాయి. వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వొద్దు. కొవిడ్‌-19 టీకాకు రూ.35వేల కోట్లు వెచ్చించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వైద్యునిగా నా దృష్టిలో అదంతా వృథా వ్యయం. కొవిడ్‌ టీకా 6-9 నెలల పాటు మాత్రమే సహాయపడుతుంది. తర్వాత ఆ రూ.35వేల కోట్లు ఆవిరైపోతాయి. ఆ మొత్తాన్ని ప్రాథమిక ఆరోగ్య రక్షణకు మళ్లించాలి. అది దేశానికి ఎంతో అవసరం. కొవిడ్‌కు విశ్వజనీనమైన టీకా సాధ్యం కాదు. కాబట్టి అంత మొత్తం వెచ్చించొద్దు. రాష్ట్రంలో కొత్త 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. కేంద్ర ప్రభుత్వం ఆ కళాశాలలకు నిధులివ్వాలి. దేశంలో 70% ప్రజలు గ్రామాల్లో ఉంటే.. అక్కడ 30% మాత్రమే అర్హులైన వైద్యులున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వైద్యులు వెళ్లేందుకు వారికి పన్నులు, పరికరాల కొనుగోళ్లు, విద్యుత్తు బిల్లుల్లో రాయితీ ఇవ్వాలి. మిక్సోపతితో ఆయుర్వేద వైద్యులు సర్జన్లు అయితే ఎంతో ప్రమాదం. ఈ విషయంపై పునరాలోచించండి. మంగళగిరి ఎయిమ్స్‌ వేగంగా పూర్తిచేసేందుకు నిధులు కేటాయించండి. కడప, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించండి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండి:

సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ.. హై కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.