అత్తింట్లో వేధింపులు ఎక్కువయ్యాయని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఓ మహిళ మీడియా ముందుకు వచ్చింది. కర్నూలు జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాజశేఖర్తో తనకు 2019లో వివాహం జరిగిందని బాధితులు సాబీరారాణి తెలిపారు.
వివాహం అయిన కొన్ని రోజుల నుంచి తనను భర్త, వారి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని వాపోయింది. పంచాయితీ చేసి తన భర్త నుంచి వేరు చేశారని బాధితురాలు వెల్లడించింది. దీనిపై మహిళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని బాధితురాలు తెలిపింది. తన భర్తతో కలిసి ఉండే విధంగా న్యాయం చేయాలని వేడుకుంది.
ఇదీ చదవండి: