ETV Bharat / state

పెట్రోల్ బంకులో చమురుకు బదులు నీళ్లు - Water instead of petrol at the petrol bunk at kurnool district

కర్నూలు జిల్లా నందికొట్కూరు - మిడుతూరు మార్గ మధ్యలో ఉన్న హెచ్​పీ పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు నీరు వచ్చింది. ఈ విషయమై బంకు యజమానిని నిలదీయగా తమ తప్పేమీ లేదని బుకాయించారు. వర్షాలు అధికంగా పడడం వల్ల ట్యాంక్ లోకి నీరు చేరిందని సర్ది చెప్పారు.

పెట్రోల్ బంకులో పెట్రోల్​కు బదులు నీళ్లు
పెట్రోల్ బంకులో పెట్రోల్​కు బదులు నీళ్లు
author img

By

Published : Sep 29, 2020, 10:22 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు - మిడుతూరు మార్గ మధ్యలో ఉన్న హెచ్​పీ పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు నీరు వచ్చింది. మిడుతూరు మండలం చెరుకుచెర్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు తన ద్విచక్ర వాహనానికి రూ. 510 రూపాయలు పెట్రోలు పట్టించాడు. కొద్ది దూరం వెళ్లగానే ద్విచక్ర వాహనం నిలిచిపోయింది. స్టార్ట్ చేస్తే ఇంతకీ స్టార్ట్ కాకపోవడంతో తోసుకుంటూ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చాడు. తాను ఇప్పుడే పెట్రోల్ పట్టించానని.. వాహనం కొద్ది దూరం వెళ్లి నిలిచిపోయిందని అక్కడ పనిచేసే వర్కర్లకు తెలియజేశాడు.

తమకు సంబంధం లేదని వారు వారించటంతో అక్కడే ఉన్న వినియోగదారులు కలుగచేసుకుని పెట్రోల్ ను పరిశీలించారు. ట్యాంకు నుంచి పెట్రోల్ కు బదులుగా నీరు రావడంపై ఆశ్చర్యపోయారు. ఈ విషయమై బంకు యజమానిని నిలదీయగా తమ తప్పేమీ లేదంటూ వర్షాలు అధికంగా పడడం వల్ల ట్యాంక్ లోకి నీరు చేరిందని బుకాయించారు. అక్కడ ఉన్న వినియోగదారులు కల్పించుకోగా.. ద్విచక్ర వాహనానికి మరమ్మతు చేయించి ఇస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కర్నూలు జిల్లా నందికొట్కూరు - మిడుతూరు మార్గ మధ్యలో ఉన్న హెచ్​పీ పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు నీరు వచ్చింది. మిడుతూరు మండలం చెరుకుచెర్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు తన ద్విచక్ర వాహనానికి రూ. 510 రూపాయలు పెట్రోలు పట్టించాడు. కొద్ది దూరం వెళ్లగానే ద్విచక్ర వాహనం నిలిచిపోయింది. స్టార్ట్ చేస్తే ఇంతకీ స్టార్ట్ కాకపోవడంతో తోసుకుంటూ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చాడు. తాను ఇప్పుడే పెట్రోల్ పట్టించానని.. వాహనం కొద్ది దూరం వెళ్లి నిలిచిపోయిందని అక్కడ పనిచేసే వర్కర్లకు తెలియజేశాడు.

తమకు సంబంధం లేదని వారు వారించటంతో అక్కడే ఉన్న వినియోగదారులు కలుగచేసుకుని పెట్రోల్ ను పరిశీలించారు. ట్యాంకు నుంచి పెట్రోల్ కు బదులుగా నీరు రావడంపై ఆశ్చర్యపోయారు. ఈ విషయమై బంకు యజమానిని నిలదీయగా తమ తప్పేమీ లేదంటూ వర్షాలు అధికంగా పడడం వల్ల ట్యాంక్ లోకి నీరు చేరిందని బుకాయించారు. అక్కడ ఉన్న వినియోగదారులు కల్పించుకోగా.. ద్విచక్ర వాహనానికి మరమ్మతు చేయించి ఇస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇదీ చదవండి:

జనం నెత్తిన 'ధర'వు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.