ETV Bharat / state

సబ్​స్టేషన్​ సిబ్బంది నిర్లక్ష్యంతో... వాచ్​మెన్ మృతి - Watchmen dead due to current shock at bhudavarapeta

విద్యుదాఘాతంతో సబ్​స్టేషన్​ వాచ్​మెన్​ మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు నగరంలోని బుధవారపేటలో జరిగింది. సబ్​ స్టేషన్​ సిబ్బంది నిర్లక్ష్యంగా.. వాచ్​మెన్​ శ్రీనివాసులను బలవంతగా విద్యుత్ స్తంభం ఎక్కించి మరమ్మతులు చేయించటంతోనే.. కరెంట్ షాక్​తో మృతి చెందాడని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని...ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సబ్​స్టేషన్​ సిబ్బంది నిర్లక్ష్యంతో... వాచ్​మెన్ మృతి
సబ్​స్టేషన్​ సిబ్బంది నిర్లక్ష్యంతో... వాచ్​మెన్ మృతి
author img

By

Published : Jun 16, 2021, 4:39 PM IST

కర్నూలు నగరంలోని బుధవార పేటలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. శ్రీనివాసులు అవుట్ సోర్సింగ్ పద్దతిలో మామిదాలపాడు విద్యుత్ సబ్ స్టేషన్​లో వాచ్ మెన్​గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి సబ్​స్టేషన్ సిబ్బంది.. వాచ్​మెన్ శ్రీనివాసులను విద్యుత్ పనుల నిమిత్తం.. స్తంభంపైకి ఎక్కించారు. మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు.. కరెంటు షాక్ కొట్టి శ్రీనివాసులు అక్కడికక్కడే చెందాడు. వాచ్​మెన్​గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని విద్యుత్ పనులను చేయమని ఎలా చెప్పారని బాధిత కుటుంబీకులు నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సబ్​స్టేషన్​ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సబ్​స్టేషన్​ సిబ్బంది నిర్లక్ష్యంతో కరెంట్ షాక్​ కొట్టి వాచ్​మెన్ మృతి
సబ్​స్టేషన్​ సిబ్బంది నిర్లక్ష్యంతో కరెంట్ షాక్​ కొట్టి వాచ్​మెన్ మృతి

ఇవీ చదవండి: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

కర్నూలు నగరంలోని బుధవార పేటలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. శ్రీనివాసులు అవుట్ సోర్సింగ్ పద్దతిలో మామిదాలపాడు విద్యుత్ సబ్ స్టేషన్​లో వాచ్ మెన్​గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి సబ్​స్టేషన్ సిబ్బంది.. వాచ్​మెన్ శ్రీనివాసులను విద్యుత్ పనుల నిమిత్తం.. స్తంభంపైకి ఎక్కించారు. మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు.. కరెంటు షాక్ కొట్టి శ్రీనివాసులు అక్కడికక్కడే చెందాడు. వాచ్​మెన్​గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని విద్యుత్ పనులను చేయమని ఎలా చెప్పారని బాధిత కుటుంబీకులు నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సబ్​స్టేషన్​ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సబ్​స్టేషన్​ సిబ్బంది నిర్లక్ష్యంతో కరెంట్ షాక్​ కొట్టి వాచ్​మెన్ మృతి
సబ్​స్టేషన్​ సిబ్బంది నిర్లక్ష్యంతో కరెంట్ షాక్​ కొట్టి వాచ్​మెన్ మృతి

ఇవీ చదవండి: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.