ETV Bharat / state

ఎమ్మిగనూరులో చోరీలు చేసిన ముగ్గురు దొంగలు అరెస్ట్

ఎమ్మిగనూరు పట్టణంలో చోరీలకు పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 30తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. కాలనీల్లో నిఘానేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.

author img

By

Published : Nov 9, 2020, 5:08 PM IST

three-suspects-arrested-for-theft-at-emmiganur-kurnool
ఎమ్మిగనూరు పట్టణంలో చోరీలకు పాల్పడిన ముగ్గురు దొంగలు అరెస్ట్

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జరిగిన దోపిడీల్లో ప్రధాన నిందితులైన మాచర్ల శ్రీకాంత్, గొల్ల అజయ్, నాగరాజును అరెస్టు చేసినట్లు శిక్షణ ఐపీఎస్ ప్రతాప్ శివ కిశోర్, డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. వారి నుంచి 30తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు ముగ్గురూ జులాయిగా తిరుగుతూ దొంగతనాలు చేసి, ఆ సొమ్ముతో జల్సాలు చేసేవారని వివరించారు.

ప్రధాన కాలనీల్లోని ప్రజలు ఎక్కడికైనా వెళ్లినపుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, గస్తీ ఏర్పాటు చేస్తామని అన్నారు. కాలనీల్లో నిఘానేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జరిగిన దోపిడీల్లో ప్రధాన నిందితులైన మాచర్ల శ్రీకాంత్, గొల్ల అజయ్, నాగరాజును అరెస్టు చేసినట్లు శిక్షణ ఐపీఎస్ ప్రతాప్ శివ కిశోర్, డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. వారి నుంచి 30తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు ముగ్గురూ జులాయిగా తిరుగుతూ దొంగతనాలు చేసి, ఆ సొమ్ముతో జల్సాలు చేసేవారని వివరించారు.

ప్రధాన కాలనీల్లోని ప్రజలు ఎక్కడికైనా వెళ్లినపుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, గస్తీ ఏర్పాటు చేస్తామని అన్నారు. కాలనీల్లో నిఘానేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్య కేసు: సీఐ, హెడ్ కానిస్టేబుల్​కు బెయిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.