ETV Bharat / state

కార్లలో తరలిస్తున్న 1600 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం

author img

By

Published : Aug 24, 2020, 5:50 PM IST

కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద 3 కార్లలో తరలిస్తున్న తెలంగాణ మద్యం 1600 సీసాలను పోలీసులు పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

telangana liquor seized by kurnool police
కార్లలో తరలిస్తున్న 1600 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం

కర్నూలు జిల్లాలో మద్యం అక్రమ రవాణా, నాటుసారా కేంద్రాలపై స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద 3 కార్లలో తరలిస్తున్న తెలంగాణ మద్యం 1600 సీసాలను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మదన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

జిల్లావ్యాప్తంగా మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారుచేస్తున్న 41 మందిపై కేసులు నమోదు చేశారు. 59 మందిని అరెస్ట్ చేసి 16 వాహనాలు సీజ్ చేశారు. 302 లీటర్ల నాటుసారాను, 3,442 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 8,970 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

కర్నూలు జిల్లాలో మద్యం అక్రమ రవాణా, నాటుసారా కేంద్రాలపై స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద 3 కార్లలో తరలిస్తున్న తెలంగాణ మద్యం 1600 సీసాలను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మదన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

జిల్లావ్యాప్తంగా మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారుచేస్తున్న 41 మందిపై కేసులు నమోదు చేశారు. 59 మందిని అరెస్ట్ చేసి 16 వాహనాలు సీజ్ చేశారు. 302 లీటర్ల నాటుసారాను, 3,442 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 8,970 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

ఇవీ చదవండి...

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.