కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మిగనూరు బైపాస్ రహదారిలో పోలీసులు వాహన తనిఖీలను నిర్వహించారు. ఓ వాహనంలో సుమారు 13 లక్షల విలువైన 37 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ముగ్గురు వ్యక్తులు... ఆదోనిలో రసీదులు లేకుండా వెండిని అమ్ముతున్నట్లు ఒకటో పట్టణ సీఐ చంద్ర శేఖర్ తెలిపారు. వెండి వస్తువులను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి-బోటు ప్రమాదంలో లభించని నంద్యాల బాలుడి ఆచూకీ