ETV Bharat / state

కర్నూలు జిల్లాలో మొదలైన ఆర్టీసీ సేవలు

author img

By

Published : May 21, 2020, 1:20 PM IST

కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలతో... జిల్లాలో 126 బస్సులు వివిధ రూట్లలో తిప్పుతున్నారు. టిక్కెట్ల కోసం బస్టాండ్లలోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. బస్సుల్లో 50 శాతం సీట్లను తొలగించారు.

RTC bus services in Kurnool district
కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు సేవలు

కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. సుమారు రెండు నెలల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. ప్రభుత్వ ఆదేశాలతో... జిల్లాలో 126 బస్సులు వివిధ రూట్లలో సర్వీసులు నడుపుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులు తిరుగుతాయి.

జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, నంద్యాల, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, బనగానపల్లి, బేతంచర్ల, రుద్రవరం, కోడుమూరు, గూడూరు, ఆత్మకూరు, డోన్ తదితర ప్రాంతాలకు 632 ట్రిప్పులు తిరగనున్నాయి. ఇతర జిల్లాలైన అనంతపురం, కడపలకు 6 బస్సులు నడుపుతున్నారు.

భౌతిక దూరం సహా శానిటైజర్, మాస్కులు వినియోగించటం తప్పనిసరి. టిక్కెట్ల కోసం బస్టాండ్లలోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. బస్సుల్లో 50 శాతం సీట్లను తొలగించారు.

ఇదీ చూడండి:

నంద్యాలలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం

కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. సుమారు రెండు నెలల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. ప్రభుత్వ ఆదేశాలతో... జిల్లాలో 126 బస్సులు వివిధ రూట్లలో సర్వీసులు నడుపుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులు తిరుగుతాయి.

జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, నంద్యాల, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, బనగానపల్లి, బేతంచర్ల, రుద్రవరం, కోడుమూరు, గూడూరు, ఆత్మకూరు, డోన్ తదితర ప్రాంతాలకు 632 ట్రిప్పులు తిరగనున్నాయి. ఇతర జిల్లాలైన అనంతపురం, కడపలకు 6 బస్సులు నడుపుతున్నారు.

భౌతిక దూరం సహా శానిటైజర్, మాస్కులు వినియోగించటం తప్పనిసరి. టిక్కెట్ల కోసం బస్టాండ్లలోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. బస్సుల్లో 50 శాతం సీట్లను తొలగించారు.

ఇదీ చూడండి:

నంద్యాలలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.