ETV Bharat / state

ఈనాడు - ఈటీవీ భారత్ కథనానికి స్పందన... ఉద్యోగుల సస్పెన్షన్

author img

By

Published : Sep 3, 2020, 9:42 PM IST

కర్నూలు జిల్లాలో ఈనాడు - ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. జిల్లాలోని గడివేములలో జరిగిన భూ అక్రమాలపై వెలువడిన కథనానికి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఘటనలో బాధ్యులైన వారందరినీ సస్పెండ్ చేశారు.

respond on ETV-EENADU article aired on land irregularities in gadivemula kurnool district
గడివేముల తహశీల్దార్ కార్యాలయం

కర్నూలు జిల్లా గడివేముల మండలంలో జరిగిన భూ అక్రమాలపై ఈనాడు - ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. కరోనా వేళ గుట్టుచప్పుడు కాకుండా... మండలంలోని 230 ఎకరాల వాగు పోరంబోకు భూమిని అసైన్డ్‌గా మార్చి పాసుపుస్తకాలు సృష్టించి ఇతరులకు కట్టబెట్టేశారు. వాటిని ఆన్​లైన్​లో ఎక్కించారు.

ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తూ కథనాలు వెలువడ్డాయి. ఆగస్టు 12న ఈటీవీలో ప్రసారమైన కథనానికి స్పందించిన కలెక్టర్ వీరపాండియన్... గడివేముల తహశీల్దారు ఇంద్రాణి, గని గ్రామ వీఆర్వో ఈశ్వర్ రెడ్డి, కొరటమద్ది వీఆర్ఏ బాలచంద్రుడు, తహశీల్దారు కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ పార్వతిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కర్నూలు జిల్లా గడివేముల మండలంలో జరిగిన భూ అక్రమాలపై ఈనాడు - ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. కరోనా వేళ గుట్టుచప్పుడు కాకుండా... మండలంలోని 230 ఎకరాల వాగు పోరంబోకు భూమిని అసైన్డ్‌గా మార్చి పాసుపుస్తకాలు సృష్టించి ఇతరులకు కట్టబెట్టేశారు. వాటిని ఆన్​లైన్​లో ఎక్కించారు.

ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తూ కథనాలు వెలువడ్డాయి. ఆగస్టు 12న ఈటీవీలో ప్రసారమైన కథనానికి స్పందించిన కలెక్టర్ వీరపాండియన్... గడివేముల తహశీల్దారు ఇంద్రాణి, గని గ్రామ వీఆర్వో ఈశ్వర్ రెడ్డి, కొరటమద్ది వీఆర్ఏ బాలచంద్రుడు, తహశీల్దారు కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ పార్వతిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి:

'రాష్ట్రానికి చంద్రబాబు ప్రవాస నేతగా మారారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.