కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు బారులు తీరారు. కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నప్పటికీ.. నిబంధనలు పాటించకుండా గుమిగూడారు. ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ చేయలన్న ఆదేశాలు ఎక్కడ అమలు కాని కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులంటున్నారు. పట్టణంలోని కల్లుబావిలో మూడు రోజుల నుంచి రేషన్ పంపిణీ కాలేదు. ఈ రోజు పంపిణీ చేయడానికి వచ్చిన వాహనం ముందు.. జనం బారులు తీరారు.
ఇవీ చూడండి: