ETV Bharat / state

అమరావతిపై మంత్రి బొత్స మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు - amaravathi

రాజధానిపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి బొత్స ఈ విషయంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి ముంపు ప్రాంతమని మరోసారి స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం, ఇటీవల ఆ ప్రాంతం ముంపునకు గురైందని వెల్లడించారు.

మంత్రి బొత్స
author img

By

Published : Aug 28, 2019, 5:51 PM IST

మీడియాతో మంత్రి బొత్స

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఈ మధ్యనే వచ్చిన వరదలకు రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని ఆయన వెల్లడించారు. రాజధాని విషయంలో గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని.. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని ముంపునకు గురవుతుందని చెప్పడంలో తప్పేముందని కర్నూలు కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షలో అన్నారు. రాజధానిపై జరుగుతున్న చర్చల్లో తనకెలాంటి సంబంధం లేదన్నారు.

కేంద్ర జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా ఏపీ తాగునీటి కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని దీని ద్వారా రాష్ట్రమంతటా తాగునీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పథకాన్ని రెండు దశల్లో చేపట్టనుండగా... మొదటి దశలోనే కర్నూలులో అమలు చేస్తామని తెలిపారు. త్వరలో సాగునీటి సలహా మండలి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

మీడియాతో మంత్రి బొత్స

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఈ మధ్యనే వచ్చిన వరదలకు రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని ఆయన వెల్లడించారు. రాజధాని విషయంలో గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని.. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని ముంపునకు గురవుతుందని చెప్పడంలో తప్పేముందని కర్నూలు కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షలో అన్నారు. రాజధానిపై జరుగుతున్న చర్చల్లో తనకెలాంటి సంబంధం లేదన్నారు.

కేంద్ర జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా ఏపీ తాగునీటి కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని దీని ద్వారా రాష్ట్రమంతటా తాగునీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పథకాన్ని రెండు దశల్లో చేపట్టనుండగా... మొదటి దశలోనే కర్నూలులో అమలు చేస్తామని తెలిపారు. త్వరలో సాగునీటి సలహా మండలి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి

బొత్స వ్యాఖ్యలపై రాజధాని ప్రాంతవాసుల మాటేంటి?

రాజధాని భూముల్లో అనేక అక్రమాలున్నాయి: బొత్స

Intro:అనంతపురం జిల్లా తరగతి నియోజకవర్గ వ్యాప్తంగా మొరాయిస్తున్న ఈవీఎంలు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 274 పోలింగ్ కేంద్రాలకు గాను 75% కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఎంపీ జేసీ. దివాకర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు 261 పోలింగ్ కేంద్రానికి రాగా ఈవీఏంలు పనిచేయక పోవడంతో కుటుంబ సభ్యులతో సహా పోలింగ్ కేంద్రంలో వేచి ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ పిఓలకు, ఏపీవోలకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం వలనే ఇలా జరిగిందన్నారు. ఈవీఎంలు పనిచేయక జరిగిన వృధా సమయాన్ని పొడగించాలని సీఎం, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ఈవీఎంలు పనిచేయకపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయని అన్నారు..


Body:ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598


Conclusion:తాడిపత్రి, అనంతపురం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.