ETV Bharat / state

Nara Lokesh: అధికారంలోకి రాగానే.. రైతుల పెట్టుబడి వ్యయం తగ్గిస్తాం: లోకేశ్​

author img

By

Published : Apr 17, 2023, 9:39 PM IST

Lokesh Yuvagalam Padayatra : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్ర 73వ రోజు ఆలూరు నియోజకవర్గంలో కొనసాగింది. నియోజకవర్గంలోని రైతులను కలిసిన లోకేశ్​ వారితో కలిసి ముచ్చటించారు. వారి సమస్యలను ఆరా తీశారు. తాము అధికారంలోకి రాగానే రైతుల సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు.

Etv Bharat
Etv Bharat
ఆలూరు నియోజకవర్గంలో లోకేశ్‌ 73వ రోజు పాదయాత్ర

Nara Lokesh Yuvagalam Padayatra : రాయలసీమ ప్రజల సాగు, తాగు నీరు సమస్య పరిష్కారానికి తెలుగుదేశం చిత్తశుద్ధితో పని చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో 73వ రోజు యువగళం పాదయాత్రను ఎంకే కొట్టాల నుంచి ప్రారంభించిన లోకేశ్​.. గుడిమిరాళ్ల రైతులు, బుర్రుకుంటలోని స్థానికులతో భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తామని లోకేశ్​ రైతులకు హామీ ఇచ్చారు. జగన్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని అవేదన వ్యక్తం చేశారు. రైతులకు నకిలీ విత్తనాలను సరఫరా చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని, దేవనకొండ మండలం వెంకటాపురంలో రైతులతో లోకేశ్​ ముఖాముఖి నిర్వహించారు.

వైసీపీ ప్రభుత్వం ఆపేసిన వేదావతి ప్రాజెక్టును 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం హయంలో నగరడోన ప్రాజెక్ట్​ నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయగా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ రెండు ప్రాజెక్టులను తాము అధికారంలోకి వస్తే.. మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. టమాటా ధర రోజుకు ఒక విధంగా మారుతోందని.. కోల్డ్​ స్టోరేజ్​ లేకపోవటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాల్యు చైన్​ పథకాన్ని 110 కోట్ల రూపాయలతో గతంలో రూపొందించామని.. దానిని వైసీపీ ప్రభుత్వం విస్మరించిదన్నారు. టమాటాకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తాము తీసుకుంటామని వివరించారు.

పశువులకు ఉచిత వైద్యం : తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జీవాలకు ఉచిత వైద్యం, మందులు అందిస్తామని వివరించారు. సబ్సిడీపై మేత పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకు పశువుల షెడ్లను సబ్సిడీపై నిర్మిస్తామని వివరించారు. ప్రతి జీవానికి ఇన్సూరెన్స్​ చేయించి.. పశువుల రైతులు ఆర్థికంగా నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని ధైర్యాన్ని ఇచ్చారు. జగన్​ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గొర్రెలు, మేకల పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. లోకేశ్​ పాదయాత్ర కొనసాగిస్తున్న సమయంలో గొర్రెల కాపరుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం : అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలపై సీనియర్​ పాత్రికేయులతో కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో మాదిరిగా ఇన్యూరెన్స్​ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అలూరు నియోజకవర్గంలోని జర్నలిస్టు సంఘం నాయకులను కలిశారు. ఆర్​ఎన్​ఐ కలిగిన ప్రతి పత్రిక, అర్హతలున్నా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులివ్వాలని.. జర్నలిస్టులకు హెల్త్​, ఇన్సూరెన్స్​ స్కీంలను పునురుద్ధరించాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు, కర్నూలులో జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లో మట్టి తవ్వకాలను నిలిపివేయాలని విన్నవించారు.

"అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలలో అటు వేదావతి ప్రాజెక్టు, రిజార్వాయర్​ పనులు పూర్తి చేస్తాం. తెలుగుదేశాన్ని గెలిపించండి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి నీటి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాము. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పడు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాము. తర్వాత ప్రభుత్వం మారింది." - నారా లోకేశ్​, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

ఎంకే కొట్టాల నుంచి ప్రారంభించిన యువగళం పాదయాత్ర.. సాయంత్రం పల్లెదొడ్డి చేరుకోవడంతో 73వ రోజు పాదయాత్ర పూర్తైంది.

ఇవీ చదవండి :

ఆలూరు నియోజకవర్గంలో లోకేశ్‌ 73వ రోజు పాదయాత్ర

Nara Lokesh Yuvagalam Padayatra : రాయలసీమ ప్రజల సాగు, తాగు నీరు సమస్య పరిష్కారానికి తెలుగుదేశం చిత్తశుద్ధితో పని చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో 73వ రోజు యువగళం పాదయాత్రను ఎంకే కొట్టాల నుంచి ప్రారంభించిన లోకేశ్​.. గుడిమిరాళ్ల రైతులు, బుర్రుకుంటలోని స్థానికులతో భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తామని లోకేశ్​ రైతులకు హామీ ఇచ్చారు. జగన్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని అవేదన వ్యక్తం చేశారు. రైతులకు నకిలీ విత్తనాలను సరఫరా చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని, దేవనకొండ మండలం వెంకటాపురంలో రైతులతో లోకేశ్​ ముఖాముఖి నిర్వహించారు.

వైసీపీ ప్రభుత్వం ఆపేసిన వేదావతి ప్రాజెక్టును 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం హయంలో నగరడోన ప్రాజెక్ట్​ నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయగా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ రెండు ప్రాజెక్టులను తాము అధికారంలోకి వస్తే.. మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. టమాటా ధర రోజుకు ఒక విధంగా మారుతోందని.. కోల్డ్​ స్టోరేజ్​ లేకపోవటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాల్యు చైన్​ పథకాన్ని 110 కోట్ల రూపాయలతో గతంలో రూపొందించామని.. దానిని వైసీపీ ప్రభుత్వం విస్మరించిదన్నారు. టమాటాకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తాము తీసుకుంటామని వివరించారు.

పశువులకు ఉచిత వైద్యం : తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జీవాలకు ఉచిత వైద్యం, మందులు అందిస్తామని వివరించారు. సబ్సిడీపై మేత పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకు పశువుల షెడ్లను సబ్సిడీపై నిర్మిస్తామని వివరించారు. ప్రతి జీవానికి ఇన్సూరెన్స్​ చేయించి.. పశువుల రైతులు ఆర్థికంగా నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని ధైర్యాన్ని ఇచ్చారు. జగన్​ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గొర్రెలు, మేకల పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. లోకేశ్​ పాదయాత్ర కొనసాగిస్తున్న సమయంలో గొర్రెల కాపరుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం : అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలపై సీనియర్​ పాత్రికేయులతో కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో మాదిరిగా ఇన్యూరెన్స్​ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అలూరు నియోజకవర్గంలోని జర్నలిస్టు సంఘం నాయకులను కలిశారు. ఆర్​ఎన్​ఐ కలిగిన ప్రతి పత్రిక, అర్హతలున్నా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులివ్వాలని.. జర్నలిస్టులకు హెల్త్​, ఇన్సూరెన్స్​ స్కీంలను పునురుద్ధరించాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు, కర్నూలులో జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లో మట్టి తవ్వకాలను నిలిపివేయాలని విన్నవించారు.

"అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలలో అటు వేదావతి ప్రాజెక్టు, రిజార్వాయర్​ పనులు పూర్తి చేస్తాం. తెలుగుదేశాన్ని గెలిపించండి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి నీటి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాము. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పడు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాము. తర్వాత ప్రభుత్వం మారింది." - నారా లోకేశ్​, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

ఎంకే కొట్టాల నుంచి ప్రారంభించిన యువగళం పాదయాత్ర.. సాయంత్రం పల్లెదొడ్డి చేరుకోవడంతో 73వ రోజు పాదయాత్ర పూర్తైంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.