ETV Bharat / state

మద్ధతు ధర దక్కక వేరుశనగ రైతు విలవిల

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​లో.. వేరుశనగ పంటను రైతులు వివిధ రేట్లకు అమ్మారు. మద్ధతు ధర కూడా రాకుండా వారి ఇష్టం వచ్చినట్లు వ్యాపారులు కొనుగోలు చేశారని అన్నదాతలు వాపోయారు. ఆయిల్​ఫెడ్ ద్వారా తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Nov 1, 2020, 5:04 PM IST

ground nut msp
మార్కెట్​కు తరలివచ్చిన వేరుశనగ

క్వింటా వేరుశనగను అధిక శాతం వ్యాపారులు నాలుగు వేల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వ్యవసాయ మార్కెట్​కు.. ఆదివారం 10,308 బస్తాల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. గరిష్ఠంగా 5,510, కనిష్ఠంగా 2,419 రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేశారని చెబుతున్నారు. నాణ్యతను పరిశీలించి రేటు నిర్ణయించినట్లు అన్నదాతలు వెల్లడించారు. ఆయిల్​ఫెడ్ ద్వారా మద్ధతు ధరకు ప్రభుత్వమే తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

క్వింటా వేరుశనగను అధిక శాతం వ్యాపారులు నాలుగు వేల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వ్యవసాయ మార్కెట్​కు.. ఆదివారం 10,308 బస్తాల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. గరిష్ఠంగా 5,510, కనిష్ఠంగా 2,419 రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేశారని చెబుతున్నారు. నాణ్యతను పరిశీలించి రేటు నిర్ణయించినట్లు అన్నదాతలు వెల్లడించారు. ఆయిల్​ఫెడ్ ద్వారా మద్ధతు ధరకు ప్రభుత్వమే తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: శ్రీశైలంలోకి ఒక్క నెలలోనే 636 టీఎంసీలు..ఆ నీరు అలాగే సముద్రంలోకి..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.