100శాతం పోలింగ్ సాధిస్తుఆదర్శంగా నిలుస్తోన్న అగ్రహారం గ్రామం కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండల పరిధిలోని జె.అగ్రహారంచిన్న ఊరు. ఉండేది కేవలం 392 మంది ఓటర్లు. అయినా... ఓటుచైతన్యంతో తమ కుగ్రామాన్ని ఆదర్శంగా నిలిపారు. ప్రతిసారి100 శాతం ఓటింగ్ సాధిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఊళ్లో గొడవలుండవు, పోలీసు కేసులుండవు, మద్యం దుకాణాలూ ఉండవు. ఎటువంటి సమస్య అయినా ఐకమత్యంగా పరిష్కరించుకుంటారు.దేశంలో ఏ మూలన ఉన్నా ఎన్నికల సమయానికి ఊరికి చేరుకుంటారు. పోటీలో ఉన్నవారిలోనచ్చిన నాయకుడికి కచ్చితంగా ఓటేస్తారు. పోలింగ్ రోజును ఓ పండగలా భావిస్తారు. ఆనవాయితీని కొనసాగిస్తూ... ఈసారీ 100 శాతం ఓటింగ్ సాధిస్తామని స్పష్టం చేస్తున్నారు గ్రామస్తులు.
గ్రామ చైతన్యానికి బీజం పడింది అప్పుడే...
గ్రామం ఇంతలాచైతన్యవంతం కావడానికి 2 దశాబ్ధాల క్రితమే బీజం పడింది. అప్పట్లో గ్రామాన్ని పట్టిపీడిస్తున్న సారా మహమ్మారిని తరిమేందుకు గ్రామంలోని మహిళలు ఏకమయ్యారు. ఈనాడు ఆధ్వర్యంలో బృందంగా ఏర్పడి ఊళ్లోకి సారా ప్రవాహాన్ని అడ్డుకున్నారు. నాటి నుంచీ అదే స్ఫూర్తితో ముందుకెళ్తూ ఆదర్శ గ్రామంగా అగ్రహారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు.
ఇవీ చూడండి.
డోన్లో ఓటుపై 'ఈనాడు - ఈటీవీ' అవగాహన