ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. అంబులెన్స్​ ఘటనపై కమిటీ - response on etv and etv bharat news

కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది కరోనా బాధితులను ఒకే అంబులెన్స్​లో తరలించడంపై ఈటీవీ - ఈటీవీ భారత్​ కథనానికి కలెక్టర్​ స్పందించారు. ఘటనపై కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈటీవీ-ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. అంబులెన్స్​ ఘటనపై కమిటీ
ఈటీవీ-ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. అంబులెన్స్​ ఘటనపై కమిటీ
author img

By

Published : Jul 16, 2020, 9:54 PM IST

కర్నూలులో ఎక్కువ మంది కరోనా బాధితులను ఒకే అంబులెన్సులో తరలించారన్న ఈటీవీ - ఈటీవీ భారత్​ కథనంపై జిల్లా కలెక్టర్​ వీరపాండియన్​ స్పందించారు. డీఎంహెచ్​వో రామగిడ్డయ్య, అంబులెన్స్​ మేనేజర్​ శివకృష్ణతో కమిటీ వేశారు. తక్షణం విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే కొత్తగా జిల్లాకు 50 అంబులెన్సులు వచ్చాయని మండలానికి ఒకటి చొప్పున అంబులెన్సులు ఉన్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే వాహనంలో ఇంతమందిని తరలించడంపై కలెక్టర్​ సైతం ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ జరిగింది..

కర్నూలు జిల్లాలోని వివిధ గ్రామాల్లో కరోనా బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు ఒకే అంబులెన్స్​ను వినియోగించారు. ఎక్కేందుకు స్థలం లేకపోయినా అందులోనే ఇరికించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. దీనిపై ఈటీవీ - ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన కలెక్టర్​ చర్యలు చేపట్టేలా కమిటీని నియమించారు.

కర్నూలులో ఎక్కువ మంది కరోనా బాధితులను ఒకే అంబులెన్సులో తరలించారన్న ఈటీవీ - ఈటీవీ భారత్​ కథనంపై జిల్లా కలెక్టర్​ వీరపాండియన్​ స్పందించారు. డీఎంహెచ్​వో రామగిడ్డయ్య, అంబులెన్స్​ మేనేజర్​ శివకృష్ణతో కమిటీ వేశారు. తక్షణం విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే కొత్తగా జిల్లాకు 50 అంబులెన్సులు వచ్చాయని మండలానికి ఒకటి చొప్పున అంబులెన్సులు ఉన్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే వాహనంలో ఇంతమందిని తరలించడంపై కలెక్టర్​ సైతం ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ జరిగింది..

కర్నూలు జిల్లాలోని వివిధ గ్రామాల్లో కరోనా బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు ఒకే అంబులెన్స్​ను వినియోగించారు. ఎక్కేందుకు స్థలం లేకపోయినా అందులోనే ఇరికించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. దీనిపై ఈటీవీ - ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన కలెక్టర్​ చర్యలు చేపట్టేలా కమిటీని నియమించారు.

ఇదీ చూడండి:

కరోనా రోగుల అంబులెన్స్​​... ఎంతమంది ఎక్కడానికైనా ఉంది లైసెన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.