ETV Bharat / state

ఈవీఎంలు, వీవీప్యాట్​లు భద్రమేనా..?

పోలింగ్ ప్రక్రియ ముగిసి ఐదు రోజులైంది. ఎన్నిక ముగిసిన మరు క్షణమే.. ఈవీఎంలు, వీవీప్యాట్​లను స్ట్రాంగ్​రూంలకు చేర్చిన ఉన్నతాధికారులు... కట్టుదిట్టమైన భద్రత కల్పించామనీ చెబుతున్నారు. ఈ విషయంలో.. రాజకీయ పార్టీల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

author img

By

Published : Apr 16, 2019, 10:31 AM IST

Updated : Apr 16, 2019, 12:49 PM IST

ఈవీఎంలు, వీవీప్యాట్​లు భద్రమేనా..?
ఈవీఎంలు, వీవీప్యాట్​లు భద్రమేనా..?

ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకున్న ఈవీఎంలు, వీవీ ప్యాట్​లకు.. స్ట్రాంగ్​ రూముల్లో అధికారులు కల్పిస్తున్న భద్రతపై పార్టీల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు పుల్లయ్య కళాశాలలో భద్రపరిచారు. నంద్యాల లోక్​సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు రాయలసీమ విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్​రూంలకు తరలించారు. ఈ నెల 11న ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు.. 12 న మధ్యాహ్నంలోగా... ఈవీఎంలు, వీవీప్యాట్​లను స్ట్రాంగ్​రూములకు చేర్చారు.

స్ట్రాంగ్​రూంల వద్ద అధికారులు మూడంచెల భద్రత కల్పించారు. కేంద్ర పారామిలటరీ బలగాలు, ఏపీఎస్పీ పోలీసులు, సివిల్ పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. 24 గంటలూ పహారా కాస్తున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... రాయలసీమ వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్​రూంల వద్ద సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. మొత్తం 60 కెమెరాలు ఉండగా... వీటిలో సగమే పనిచేస్తున్నాయి. మిగిలిన కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి.

4 రోజుల తర్వాత మేల్కొన్న అధికారులు హడావుడిగా... కొత్త కెమెరాలు అమర్చే పనిలో పడ్డారు. ఈ విషయమై ''ఈనాడు - ఈటీవి భారత్'' ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించగా... అన్ని కెమెరాలు పనిచేస్తున్నాయని సమాధానం చెప్పారు. కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయని కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక్క రాయలసీమ విశ్వవిద్యాలయంలోనే ఈ పరిస్థితి ఉందా... లేదంటే అన్ని కేంద్రాల దగ్గరా ఇలాంటి నిర్లక్ష్యమే చూపిస్తున్నారా... అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈవీఎంలకు భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి

తమిళనాడు ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు

ఈవీఎంలు, వీవీప్యాట్​లు భద్రమేనా..?

ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకున్న ఈవీఎంలు, వీవీ ప్యాట్​లకు.. స్ట్రాంగ్​ రూముల్లో అధికారులు కల్పిస్తున్న భద్రతపై పార్టీల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు పుల్లయ్య కళాశాలలో భద్రపరిచారు. నంద్యాల లోక్​సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు రాయలసీమ విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్​రూంలకు తరలించారు. ఈ నెల 11న ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు.. 12 న మధ్యాహ్నంలోగా... ఈవీఎంలు, వీవీప్యాట్​లను స్ట్రాంగ్​రూములకు చేర్చారు.

స్ట్రాంగ్​రూంల వద్ద అధికారులు మూడంచెల భద్రత కల్పించారు. కేంద్ర పారామిలటరీ బలగాలు, ఏపీఎస్పీ పోలీసులు, సివిల్ పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. 24 గంటలూ పహారా కాస్తున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... రాయలసీమ వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్​రూంల వద్ద సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. మొత్తం 60 కెమెరాలు ఉండగా... వీటిలో సగమే పనిచేస్తున్నాయి. మిగిలిన కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి.

4 రోజుల తర్వాత మేల్కొన్న అధికారులు హడావుడిగా... కొత్త కెమెరాలు అమర్చే పనిలో పడ్డారు. ఈ విషయమై ''ఈనాడు - ఈటీవి భారత్'' ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించగా... అన్ని కెమెరాలు పనిచేస్తున్నాయని సమాధానం చెప్పారు. కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయని కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక్క రాయలసీమ విశ్వవిద్యాలయంలోనే ఈ పరిస్థితి ఉందా... లేదంటే అన్ని కేంద్రాల దగ్గరా ఇలాంటి నిర్లక్ష్యమే చూపిస్తున్నారా... అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈవీఎంలకు భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి

తమిళనాడు ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు

sample description
Last Updated : Apr 16, 2019, 12:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.