ETV Bharat / state

ఎనిమిదేళ్లకే కొలువు... ఉద్యోగ విరమణకు సెలవు

రాయలసీమ విశ్వవిద్యాలయంలో అంతులేని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అవినీతి, అక్రమాలు జరుగుతున్నా... యంత్రాంగం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. నిబంధనలు బేఖాతరు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేసేందుకు పూర్తి వివరాలు ఇవ్వాలని ఈనెల 4వ తేదీన ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర వర్సిటీ అధికారులను ఆదేశించారు.

author img

By

Published : Jun 11, 2020, 5:34 PM IST

jobs issue in rayalaseema university
ఆర్​యూలో కొలువులపై ఆరా తీస్తోన్న ఉన్నతాధికారులు

రాయలసీమ విశ్వవిద్యాలయంలో టీచింగ్‌ విభాగంలో 59 పోస్టులకుగాను 49 మందిని కాంట్రాక్టు (ఒప్పంద), నలుగురిని ఎంటీఎస్‌ (మినిమం టైం స్కేల్‌) కింద భర్తీ చేశారు. బోధనేతర సిబ్బంది విభాగంలో ఉన్న 131 మంది కాంట్రాక్టు సిబ్బందిలో 105 మంది మినిమం టైం స్కేల్‌ కింద పనిచేస్తున్నారు. మిగిలిన వారిని అవుట్‌సోర్సింగ్‌ కింద భర్తీ చేశారు. మినిమం టైం స్కేల్‌ కింద అర్హత సాధించిన వారంతా అప్పట్లో సిఫార్సులతో వచ్చినవారే. టైం స్కేల్‌ నుంచి రెగ్యులర్‌గా నియామకమైన నలుగురికి సంబంధించి రోస్టర్‌, వయస్సును పరిగణలోకి తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి.

అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఒకరు, గ్రంథాలయ సహాయకులు ఒకరు, పరీక్షల నియంత్రణాధికారి, ఇంజినీరింగ్‌ విభాగంలో ఒకరు.. ఇలా మొత్తం ఏడుగురు ఉద్యోగ నియామక అర్హత వయస్సు దాటినా కొలువులు పొందారు. నాలుగో తరగతి ఉద్యోగుల్లో కొందరికి 60 ఏళ్లు దాటినా ఇంకా పనిచేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నాయి. జీవో నంబరు 2323 ప్రకారం పదవీ విరమణ పొంది గత ప్రభుత్వ హయాంలో నియామకాలు పొందిన మరో ఇద్దరు ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ వర్సిటీ యాజమాన్యం పట్టించుకోలేదు.

* ఓ వ్యక్తి పుట్టిన తేదీ 01.7.1990 కాగా.. 01.11.1998లో మినిమం టైం స్కేల్‌ (ఎంటీఎస్‌) కింద రాయలసీమ విశ్వవిద్యాలయంలో కొలువులో చేరారు. ఎనిమిదేళ్లకే తొమ్మిదో తరగతి చదివినట్లు ప్రధాన కార్యదర్శికి అందించిన వివరాల్లో ఉండటం ఒక ఎత్తైతే... 8 ఏళ్లకే కొలువులో చేరడం మరో విచిత్రం. కార్మిక చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారు పనిచేస్తుంటే బాల కార్మికులుగా గుర్తిస్తారు. పనిచేయిస్తున్న యజమానిపై కేసు నమోదు చేస్తారు. ఆర్‌యూలో మాత్రం ఈ నిబంధనలు వర్తించవా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

* ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు. ఆర్‌యూలో మాత్రం పదవీ విరమణ వయస్సు దాటినా కొనసాగుతూనే ఉన్నారు. ప్రతి నెలా వారికి వేతనం ఇస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. 50 ఏళ్లు దాటినా కొలువులు ఇచ్చేస్తున్నారు.

అర్హత లేనివారికి చోటు

ఆర్‌యూలో పీజీ కేంద్రం ఉన్నప్పటి నుంచి 42 రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశించింది. 28 మందిని భర్తీ చేయగా 14 ఖాళీలున్నాయి. నాలుగేళ్ల కిందట పూర్వపు వైస్‌ ఛాన్సలర్‌ హయాంలో రెగ్యులర్‌ ఉద్యోగులుగా నియామకాలు పొందేందుకు విశ్వవిద్యాలయం నిర్వహించే ఉత్తీర్ణత పరీక్షలో అర్హత సాధించాలని పాలకమండలిలో ఆమోదం తీసుకున్నారు. వర్సిటీ ఆధ్వర్యంలో ఉత్తీర్ణత పరీక్ష నిర్వహించినప్పటికీ ఫలితాలు వెల్లడించకుండా అర్హతలేని వారిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా తీసుకున్నారు. ఈ నియామకాలను మొన్న జరిగిన పాలకమండలిలో ఆమోదించకపోవడమే ఇందుకు నిదర్శనం.

నకిలీ ధ్రువపత్రాలతో కొలువు

ఒప్పంద ఉద్యోగులు నకిలీ ధ్రువపత్రాలతో కొలువు సాధించినట్లు గతంలోనే వెలుగులోకి వచ్చింది. దీనివల్ల ఉద్యోగ అర్హతలను పేపరుపై చూపిస్తున్నారే తప్ప కంప్యూటర్‌ పరిజ్ఞానం, పనిచేసే అనుభవం లేక సతమతమవుతున్నారు. ఈ-ఆఫీస్‌లో పనిచేయాలని ప్రభుత్వ ఆదేశాలొచ్చినప్పటికీ ఆర్‌యూలో పనిచేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ-ఆఫీస్‌ వద్దని ఉద్యోగులు చర్చించుకోవడం దేనికి సంకేతమో అర్థం కావడం లేదు. వర్సిటీలో వైస్‌ ఛాన్సలర్‌గా ఐఏఎస్‌ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ అధికారి అయినా దీనిపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చూడండి:లంచమిస్తే చాలు.. కేసులన్నీ నీరుగారు

రాయలసీమ విశ్వవిద్యాలయంలో టీచింగ్‌ విభాగంలో 59 పోస్టులకుగాను 49 మందిని కాంట్రాక్టు (ఒప్పంద), నలుగురిని ఎంటీఎస్‌ (మినిమం టైం స్కేల్‌) కింద భర్తీ చేశారు. బోధనేతర సిబ్బంది విభాగంలో ఉన్న 131 మంది కాంట్రాక్టు సిబ్బందిలో 105 మంది మినిమం టైం స్కేల్‌ కింద పనిచేస్తున్నారు. మిగిలిన వారిని అవుట్‌సోర్సింగ్‌ కింద భర్తీ చేశారు. మినిమం టైం స్కేల్‌ కింద అర్హత సాధించిన వారంతా అప్పట్లో సిఫార్సులతో వచ్చినవారే. టైం స్కేల్‌ నుంచి రెగ్యులర్‌గా నియామకమైన నలుగురికి సంబంధించి రోస్టర్‌, వయస్సును పరిగణలోకి తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి.

అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఒకరు, గ్రంథాలయ సహాయకులు ఒకరు, పరీక్షల నియంత్రణాధికారి, ఇంజినీరింగ్‌ విభాగంలో ఒకరు.. ఇలా మొత్తం ఏడుగురు ఉద్యోగ నియామక అర్హత వయస్సు దాటినా కొలువులు పొందారు. నాలుగో తరగతి ఉద్యోగుల్లో కొందరికి 60 ఏళ్లు దాటినా ఇంకా పనిచేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నాయి. జీవో నంబరు 2323 ప్రకారం పదవీ విరమణ పొంది గత ప్రభుత్వ హయాంలో నియామకాలు పొందిన మరో ఇద్దరు ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ వర్సిటీ యాజమాన్యం పట్టించుకోలేదు.

* ఓ వ్యక్తి పుట్టిన తేదీ 01.7.1990 కాగా.. 01.11.1998లో మినిమం టైం స్కేల్‌ (ఎంటీఎస్‌) కింద రాయలసీమ విశ్వవిద్యాలయంలో కొలువులో చేరారు. ఎనిమిదేళ్లకే తొమ్మిదో తరగతి చదివినట్లు ప్రధాన కార్యదర్శికి అందించిన వివరాల్లో ఉండటం ఒక ఎత్తైతే... 8 ఏళ్లకే కొలువులో చేరడం మరో విచిత్రం. కార్మిక చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారు పనిచేస్తుంటే బాల కార్మికులుగా గుర్తిస్తారు. పనిచేయిస్తున్న యజమానిపై కేసు నమోదు చేస్తారు. ఆర్‌యూలో మాత్రం ఈ నిబంధనలు వర్తించవా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

* ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు. ఆర్‌యూలో మాత్రం పదవీ విరమణ వయస్సు దాటినా కొనసాగుతూనే ఉన్నారు. ప్రతి నెలా వారికి వేతనం ఇస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. 50 ఏళ్లు దాటినా కొలువులు ఇచ్చేస్తున్నారు.

అర్హత లేనివారికి చోటు

ఆర్‌యూలో పీజీ కేంద్రం ఉన్నప్పటి నుంచి 42 రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశించింది. 28 మందిని భర్తీ చేయగా 14 ఖాళీలున్నాయి. నాలుగేళ్ల కిందట పూర్వపు వైస్‌ ఛాన్సలర్‌ హయాంలో రెగ్యులర్‌ ఉద్యోగులుగా నియామకాలు పొందేందుకు విశ్వవిద్యాలయం నిర్వహించే ఉత్తీర్ణత పరీక్షలో అర్హత సాధించాలని పాలకమండలిలో ఆమోదం తీసుకున్నారు. వర్సిటీ ఆధ్వర్యంలో ఉత్తీర్ణత పరీక్ష నిర్వహించినప్పటికీ ఫలితాలు వెల్లడించకుండా అర్హతలేని వారిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా తీసుకున్నారు. ఈ నియామకాలను మొన్న జరిగిన పాలకమండలిలో ఆమోదించకపోవడమే ఇందుకు నిదర్శనం.

నకిలీ ధ్రువపత్రాలతో కొలువు

ఒప్పంద ఉద్యోగులు నకిలీ ధ్రువపత్రాలతో కొలువు సాధించినట్లు గతంలోనే వెలుగులోకి వచ్చింది. దీనివల్ల ఉద్యోగ అర్హతలను పేపరుపై చూపిస్తున్నారే తప్ప కంప్యూటర్‌ పరిజ్ఞానం, పనిచేసే అనుభవం లేక సతమతమవుతున్నారు. ఈ-ఆఫీస్‌లో పనిచేయాలని ప్రభుత్వ ఆదేశాలొచ్చినప్పటికీ ఆర్‌యూలో పనిచేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ-ఆఫీస్‌ వద్దని ఉద్యోగులు చర్చించుకోవడం దేనికి సంకేతమో అర్థం కావడం లేదు. వర్సిటీలో వైస్‌ ఛాన్సలర్‌గా ఐఏఎస్‌ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ అధికారి అయినా దీనిపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చూడండి:లంచమిస్తే చాలు.. కేసులన్నీ నీరుగారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.