ETV Bharat / state

200 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ

author img

By

Published : May 12, 2020, 12:22 PM IST

కర్నూలు జిల్లాలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా సరుకులను పంపిణీ చేశారు.

kurnool district
200 మందికి నిత్యావసర సరకులు పంపిణీ

కర్నూలు జిల్లా కోడుమూరులో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా సరుకులను పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనాలపై ఇంటింటికి వెళ్లి సరుకులు అందజేశారు. విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గంలోని పేదలకు ఉచితంగా ఇచ్చేందుకు సంఘం సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ సంఘం సభ్యులు నాగరాజు, వెంకటస్వామి చెప్పారు. మొత్తం 200 మందికి బియ్యం, 5 రకాల కూరగాయలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు వీర శేఖర్ ఆచారి, నాగేంద్ర ఆచారి, వేంగోడు శ్రీనివాసాచారి, తిమ్మయ్య ఆచారి తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా కోడుమూరులో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా సరుకులను పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనాలపై ఇంటింటికి వెళ్లి సరుకులు అందజేశారు. విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గంలోని పేదలకు ఉచితంగా ఇచ్చేందుకు సంఘం సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ సంఘం సభ్యులు నాగరాజు, వెంకటస్వామి చెప్పారు. మొత్తం 200 మందికి బియ్యం, 5 రకాల కూరగాయలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు వీర శేఖర్ ఆచారి, నాగేంద్ర ఆచారి, వేంగోడు శ్రీనివాసాచారి, తిమ్మయ్య ఆచారి తదితరులు పాల్గొన్నారు.

ఇది చదవండి శ్రీశైలం రోడ్డుపై తిరుగుతున్న చిరుతను చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.