country made bomb in kurnool: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి సమీపంలోని ఓ పొలంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. పత్తి పొలంలో.. పత్తి తీస్తున్న షేక్ హయద్ బీ అనే మహిళకు చిన్న కవర్ కనిపించింది. అందులో ఏముందోనని తెరచి చూడగా.. ఊహించని విధంగా బాంబు పేలింది.
ఈ ఘటనలో మహిళ నాలుగు వేళ్లూ తెగిపోయాయి. గమనించిన స్థానికులు.. హుటాహుటిన కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. అదే పొలంలో మరో బాంబును పోలీసులు గుర్తించారు. అడవి పందుల కోసం బాంబులు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
MP RRR: నాడు రాళ్లు వేస్తే పారిపోయారు.. జగన్పై ఎంపీ రఘురామ వ్యంగ్యాస్త్రాలు