కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రయాణికులు డిపో మేనేజర్కు ఫిర్యాదు చేశారు. ధర్మవరం నుంచి కర్నూలు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న కరోనా అనుమానిత వ్యక్తి డోన్లో దిగిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలో బస్సును వెంటనే ఆపివేయాలని డిపో మేనేజర్ వెల్దుర్తి పోలీసులకు సమాచారమిచ్చారు. స్పందించిన పోలీసులు బస్సులోని ప్రయాణికులను వైద్య పరీక్షల కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. డోన్లో బస్సు దిగిపోయిన కరోనా అనుమానిత వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: