కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన కులదీప్ సివిల్స్లో 135వ ర్యాంకు సాధించారు. దీంతో కులదీప్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నవిశ్వేశ్వరయ్య, రాజరాజేశ్వరిల సంతానం కులదీప్. అసోంలోని ఎన్ఐటిలో బీటెక్ పూర్తి చేశారు. గతేడాది సివిల్స్లో ఐపీఎస్ సాధించి రెండో విడత శిక్షణలో అహ్మదాబాద్లో ఉన్నారు. తమ కుమారుడికి మంచి ర్యాంకు రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం.. ఒకరు మృతి