ETV Bharat / state

బ్యాంకు ఖాతాల్లో నగదు మాయం... పట్టించుకోని సిబ్బంది... - కర్నూలు జిల్లాలోని బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము మాయం

బ్యాంకుల్లో సొమ్ము దాచుకోవటానికి కారణం భద్రంగా ఉంటుందనే. అక్కడా భద్రత కరవైతే...! పోనీ జరిగిన మోసాన్ని గుర్తించాలని బ్యాంకుల వద్దకు వెళితే.. బాధితులు గగ్గోలు పెట్టటం తప్పా.. సరైన సమాచరం ఉండదు. వేలకు వేలు ఖాతా నుంచి మాయమవుతుంటే.. పోగొట్టుకున్న సొమ్ము కోసం బ్యాంకు, పోలీస్‌ స్టేషన్‌, సైబర్‌ క్రైం స్టేషన్ల చుట్టూ తిరగటం తప్పా ప్రయోజనం శూన్యం. ఇందుకు నిలువెత్తు సాక్ష్యం కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగిన సంఘటన.

Cash in bank account is disappeared innandikotkur bank atms in kurnool district
బ్యాంకు ఖాతాల్లో నగదు మాయం..!?
author img

By

Published : Jan 9, 2020, 8:29 AM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవరు నాగిరెడ్డికి మూడు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. ఎస్‌బీఐ ఖాతాలో నెలవారీ వేతనం పడుతుంది. అంతేకాకుండా కొంత సొమ్మును దాచుకున్నారు. తాను విధుల్లో ఉన్న సమయంలో జూపాడుబంగ్లా మండలం పారుమంచాల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతా నుంచి ఈనెల 3న రూ.3 వేలు విత్‌డ్రా చేసినట్లు చరవాణికి సందేశం వచ్చింది. అదే రోజున నందికొట్కూరులోని ఆంధ్రా బ్యాంకు ఖాతా నుంచి రూ.2,500 విత్‌డ్రా చేసినట్లు మళ్లీ సందేశం వచ్చింది. నందికొట్కూరు ఎస్‌బీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.9,999 అదేరోజు ఆగంతుకులు మాయం చేశారు. ఈనెల 4న ఎస్‌బీఐ ఖాతా నుంచి మరో రూ.9,999 మాయమయ్యాయి. ఖాతాల్లో సొమ్ము మాయమవుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న నాగిరెడ్డి తన ఖాతాలో మిగిలిన సొమ్మును తీసేసుకున్నారు. రెండు రోజుల్లో రూ.25,498 పోయిన విషయంపై నందికొట్కూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మట్టకందాల గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవరు సామేలుకు ఇదే పరిస్థితి ఎదురైంది. రూ.వెయ్యి డ్రా చేసుకోగా, మరో రూ.1000 డ్రా చేసినట్లు చరవాణికి సందేశం వచ్చింది. వెంటనే బ్యాంకు వద్దకు వెళితే.. తమకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా చెబుతున్నట్లు వాపోయారు. తన లాంటి బాధితులు 15 మంది పైగానే ఉన్నారని, ధైర్యంగా ఎవరూ ముందుకు రావటం లేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

బ్యాంకు ఖాతాల్లో నగదు మాయం..!?

కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవరు నాగిరెడ్డికి మూడు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. ఎస్‌బీఐ ఖాతాలో నెలవారీ వేతనం పడుతుంది. అంతేకాకుండా కొంత సొమ్మును దాచుకున్నారు. తాను విధుల్లో ఉన్న సమయంలో జూపాడుబంగ్లా మండలం పారుమంచాల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతా నుంచి ఈనెల 3న రూ.3 వేలు విత్‌డ్రా చేసినట్లు చరవాణికి సందేశం వచ్చింది. అదే రోజున నందికొట్కూరులోని ఆంధ్రా బ్యాంకు ఖాతా నుంచి రూ.2,500 విత్‌డ్రా చేసినట్లు మళ్లీ సందేశం వచ్చింది. నందికొట్కూరు ఎస్‌బీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.9,999 అదేరోజు ఆగంతుకులు మాయం చేశారు. ఈనెల 4న ఎస్‌బీఐ ఖాతా నుంచి మరో రూ.9,999 మాయమయ్యాయి. ఖాతాల్లో సొమ్ము మాయమవుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న నాగిరెడ్డి తన ఖాతాలో మిగిలిన సొమ్మును తీసేసుకున్నారు. రెండు రోజుల్లో రూ.25,498 పోయిన విషయంపై నందికొట్కూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మట్టకందాల గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవరు సామేలుకు ఇదే పరిస్థితి ఎదురైంది. రూ.వెయ్యి డ్రా చేసుకోగా, మరో రూ.1000 డ్రా చేసినట్లు చరవాణికి సందేశం వచ్చింది. వెంటనే బ్యాంకు వద్దకు వెళితే.. తమకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా చెబుతున్నట్లు వాపోయారు. తన లాంటి బాధితులు 15 మంది పైగానే ఉన్నారని, ధైర్యంగా ఎవరూ ముందుకు రావటం లేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

బ్యాంకు ఖాతాల్లో నగదు మాయం..!?

ఇదీ చదవండి:

కర్నూలు డీఈవో సాయిరాంపై సస్పెన్షన్​ వేటు

Intro:కర్నూలు జిల్లా నందికొట్కూరు ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తుల ఖాతా నుంచి సొమ్ము మాయం అవుతుంది ఐ సి ఐ సి ఐ బ్యాంకుల ఆధ్వర్యంలో నిర్వహించే వినియోగదారుల సేవ కేంద్రం ఏటీఎంల ద్వారా సొమ్ము మాయం అవుతున్నట్లు బాధితులు తెలిపారు డ్రైవర్ నాగిరెడ్డికి నందికొట్కూరు పట్టణంలో ని ఎస్బిఐ ఆంధ్ర బ్యాంక్ లతో పాటుగా జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి ఎస్బిఐ బ్యాంక్ ఖాతా తన నెలసరి వేతనానికి లింక్ అప్ అయింది ప్రతి నెల వేతనం జమ అవుతుంది ఎస్బిఐ ఖాతా నుంచి ఈ నెల 3వ తేదీన ₹9999 వినియోగదారుల సేవా కేంద్రం ద్వారా చేశారు పారుమంచాల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నుంచి 3000 నందికొట్టుకురు పట్టణంలోని ఆంధ్ర బ్యాంకు నుంచి 2500 విత్ డ్రా చేసినట్లు తన తెరవడానికి మెసేజ్ వచ్చింది ఆ రోజు విధుల్లో ఉండడం వల్ల బ్యాంకుకు వెళ్లి విచారించు కాలేకపోయారు నాలుగవ తేదీ ఎస్బిఐ ఖాతా నుంచి మళ్లీ ₹9999 విత్ డ్రా యల్ చేశారు విధుల అనంతరం డ్యూటీ దిగి నేరుగా బ్యాంకులో వద్దకు వెళ్లి విచారించారు వినియోగదారుల సేవా కేంద్రం ద్వారా తమ ఖాతాలోని సొమ్మును కొట్టినట్లు సంబంధిత బ్యాంకు సిబ్బంది తెలిపారు మరో డ్రైవర్ సామేలు ఈనెల 4వ తేదీన ఎస్ బి ఐ ఎటిఎం నుంచి వెయ్యి రూపాయలు విత్డ్రా చేశారు అదే రోజు సాయంత్రం మరో వెయ్యి రూపాయలు విత్డ్రా చేసినట్లు వానికి మెసేజ్ వచ్చింది వెంటనే బ్యాంకు వద్దకు వెళ్లి తమకు వచ్చిన మెసేజ్ గురించి బ్యాంకు సిబ్బందికి తెలిపారు అనంతరం ఏటీఎం ద్వారా రా ఖాతా నిల్వ నిను చూసుకోగా విత్డ్రా అయినట్లు తేలింది ఇలా నందికొట్కూరు పట్టణంలో వినియోగదారుల సేవా కేంద్రం ద్వారా మోసపోయిన బాధితులు ఉన్నట్లు బాధితులు తెలిపారు


Body:ss


Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.