బోయిన్పల్లి అపహరణ కేసులో ఏ1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై సందిగ్ధత కొనసాగుతోంది. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన సికింద్రాబాద్ కోర్టు విచారణను మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది.
మరోవైరు అఖిలప్రియ భర్త భార్గవ్రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై సికింద్రాబాద్ న్యాయస్థానంలో వాదనలు జరగనున్నాయి. అఖిల ప్రియ భర్త భార్గవ్రామ్కు ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో భార్గవ్ రామ్కు ఎలాంటి సంబంధం లేదని... ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. కేసులో ఏ3గా ఉన్న భార్గవ్రామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
భార్గవ్రామ్కు బెయిల్ మంజూరు చేయొద్దని.... భూవివాదం విషయంలో ముగ్గురు అన్నదమ్ములను అపహరించి, బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలను విన్న న్యాయస్ధానం తీర్పు వెలువరించనుంది. విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సోమవారం వాదనలు కొనసాగనున్నాయి.
ఇదీ చూడండి: 'రాధేశ్యామ్'లో పరమహంసగా రెబల్స్టార్!