ETV Bharat / state

ఆదోనిలో ఐపీఎల్ బెట్టింగ్.. ఏడుగురు అరెస్ట్

author img

By

Published : Apr 25, 2021, 7:50 AM IST

గుట్టుచప్పుడు కాకుండా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న యువకుల్ని ఆదోని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.85 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

betting in adoni
ఐపీఎల్ బెట్టింగ్

ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఏడుగురు యువకులను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.85 వేల నగదుతో పాటు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీరాములు తెలిపారు. పట్టణంలోని ఓ ఇంట్లో బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో.. ఆర్ఆర్​లేబర్ కాలనీ ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏడుగురు యువకులు పట్టుబడ్డారు. యువత ఇలాంటి జూదాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని.. ఈ తరహా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరాములు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఏడుగురు యువకులను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.85 వేల నగదుతో పాటు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీరాములు తెలిపారు. పట్టణంలోని ఓ ఇంట్లో బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో.. ఆర్ఆర్​లేబర్ కాలనీ ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏడుగురు యువకులు పట్టుబడ్డారు. యువత ఇలాంటి జూదాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని.. ఈ తరహా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరాములు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. పక్కింటి దంపతులే నిందితులు!

భారత్ చేరుకున్న నాలుగు క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.