ETV Bharat / state

Modi govt success: 'నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో.. దేశం పురోగమిస్తోంది'

author img

By

Published : May 30, 2023, 7:40 PM IST

BJP leaders highlight Narendra Modi successes: నరెేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం అభివద్ధి దిశగా పయనిస్తుందని బీజేపీ నేతలు టీజీ వెంకటేష్, జీవీఎల్ నర్సింహారావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో గెలవడం ఖాయమని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. జనసేన, తెలుగుదేశం కలిసే ఉన్నాయని... పవన్‌కల్యాణ్‌తో పొత్తు విషయం ఎన్నికల ముందు పార్టీ నిర్ణయిస్తుందని టీజీ వెంకటేష్ వెల్లడించారు.

Modi  successes
నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన

9 years of Modi govt: జనసేన, తెలుగుదేశం కలిసే ఉన్నాయని.. పవన్‌కల్యాణ్‌తో పొత్తు విషయం ఎన్నికల ముందు పార్టీ నిర్ణయిస్తుందని.. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. జనసేన చంద్రబాబు కలిసి ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయని టీజీ వెల్లడించారు. అయితే, బీజేపీతో పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేసే అంశంపై బీజేపీ పార్టీ పెద్దలు త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

మోదీ తొమ్మిదేళ్ల పాలనపై బీజేపీ నేతల మీడియా సమావేశం

కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 20శాతం నిధులు ఖర్చు చేస్తే, కేంద్ర ప్రభుత్వం 80శాతం నిధులు కేటాయిస్తోందన్నారు. కేంద్ర పథకాలను పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వానివిగా ప్రచారం చేసుకుంటున్నారని టీజీ వెంకటేష్ ఆరోపించారు. కేంద్రాన్ని ఒప్పించి కర్నూల్లో క్యాన్సర్ హాస్పిటల్ మంజూరు చేయిస్తే.. కేంద్రం 90 కోట్లు మంజూరు చేసినా... రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి పనులు ఇంకా పూర్తి చేయలేదని టీజీ విమర్శించారు. మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకొని, బలమైనా ఆర్థిక శక్తిగా ఎదిగిందని, సహజ వనరులతోనే దేశాభివృద్ధి సాధ్యమైందని వివరించారు.

పంచ భూతాలతో అభివృద్ధి: ఈ తొమ్మిది సంవత్సరాల్లో నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి చెందుతోందని టీజీ వెల్లడించారు. మోదీ ఆధ్వర్యంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలు చూస్తున్నారని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. పంచ భూతాలను వాడుకొని ''భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని" ఇలా పంచభూతాలను వినియోగించుకుంటూ దేశం అభివృద్ధి చెందేందుకు మోదీ కృషి చేస్తున్నారని టీజీ వెంకటేష్ వెల్లడించారు.

'సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్.. మోదీ'

మొబైల్స్, ఆటోమొబైల్స్ రంగాలలో గణనీయ ప్రగతి: గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో గెలవడం ఖాయమని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. 65 ఏళ్లలో జరగని అభివృద్ధిని ప్రధాని మోదీ 9 ఏళ్లలో సాధించారని జీవీఎల్ వెల్లడించారు. ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని గుర్తుచేశారు.

గ్రాండ్​గా కొత్త పార్లమెంట్​​ ఓపెనింగ్.. 'సెంగోల్'​కు మోదీ సాష్టాంగ నమస్కారం.. ఫొటోలు చూశారా?

ఆత్మనిర్భర భారత్ కేవలం నినాదం కాదని, సాకారమైందని అభిప్రాయపడ్డారు. మొబైల్స్, ఆటోమొబైల్స్ రంగాలలో గణనీయ ప్రగతి సాధించామన్నారు. 112 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను కేంద్రప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిందన్నారు. సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఉపాధి హామీ కార్యక్రమం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని జీవీఎల్ వెల్లడించారు రాష్ట్రాల్లో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కేంద్ర పథకాలను మాత్రం రాష్ట్రప్రభుత్వాలు స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నాయని జీవీఎల్ ఆరోపించారు.

9 years of Modi govt: జనసేన, తెలుగుదేశం కలిసే ఉన్నాయని.. పవన్‌కల్యాణ్‌తో పొత్తు విషయం ఎన్నికల ముందు పార్టీ నిర్ణయిస్తుందని.. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. జనసేన చంద్రబాబు కలిసి ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయని టీజీ వెల్లడించారు. అయితే, బీజేపీతో పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేసే అంశంపై బీజేపీ పార్టీ పెద్దలు త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

మోదీ తొమ్మిదేళ్ల పాలనపై బీజేపీ నేతల మీడియా సమావేశం

కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 20శాతం నిధులు ఖర్చు చేస్తే, కేంద్ర ప్రభుత్వం 80శాతం నిధులు కేటాయిస్తోందన్నారు. కేంద్ర పథకాలను పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వానివిగా ప్రచారం చేసుకుంటున్నారని టీజీ వెంకటేష్ ఆరోపించారు. కేంద్రాన్ని ఒప్పించి కర్నూల్లో క్యాన్సర్ హాస్పిటల్ మంజూరు చేయిస్తే.. కేంద్రం 90 కోట్లు మంజూరు చేసినా... రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి పనులు ఇంకా పూర్తి చేయలేదని టీజీ విమర్శించారు. మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకొని, బలమైనా ఆర్థిక శక్తిగా ఎదిగిందని, సహజ వనరులతోనే దేశాభివృద్ధి సాధ్యమైందని వివరించారు.

పంచ భూతాలతో అభివృద్ధి: ఈ తొమ్మిది సంవత్సరాల్లో నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి చెందుతోందని టీజీ వెల్లడించారు. మోదీ ఆధ్వర్యంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలు చూస్తున్నారని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. పంచ భూతాలను వాడుకొని ''భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని" ఇలా పంచభూతాలను వినియోగించుకుంటూ దేశం అభివృద్ధి చెందేందుకు మోదీ కృషి చేస్తున్నారని టీజీ వెంకటేష్ వెల్లడించారు.

'సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్.. మోదీ'

మొబైల్స్, ఆటోమొబైల్స్ రంగాలలో గణనీయ ప్రగతి: గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో గెలవడం ఖాయమని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. 65 ఏళ్లలో జరగని అభివృద్ధిని ప్రధాని మోదీ 9 ఏళ్లలో సాధించారని జీవీఎల్ వెల్లడించారు. ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని గుర్తుచేశారు.

గ్రాండ్​గా కొత్త పార్లమెంట్​​ ఓపెనింగ్.. 'సెంగోల్'​కు మోదీ సాష్టాంగ నమస్కారం.. ఫొటోలు చూశారా?

ఆత్మనిర్భర భారత్ కేవలం నినాదం కాదని, సాకారమైందని అభిప్రాయపడ్డారు. మొబైల్స్, ఆటోమొబైల్స్ రంగాలలో గణనీయ ప్రగతి సాధించామన్నారు. 112 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను కేంద్రప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిందన్నారు. సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఉపాధి హామీ కార్యక్రమం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని జీవీఎల్ వెల్లడించారు రాష్ట్రాల్లో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కేంద్ర పథకాలను మాత్రం రాష్ట్రప్రభుత్వాలు స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నాయని జీవీఎల్ ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.