కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. నగరంలోని పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు లక్ష ఈ-మెయిల్స్ను రాజధాని కమిటీకి పంపారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేపట్టిన రిలే నిరహర దీక్ష నేటికి 56వ రోజుకు చేరుకుంది. హైకోర్టు సాధన కోసం గురువారం విద్యాసంస్థల బంద్కు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: